ఇన్వెస్టర్స్ జ్యూస్ తీసేసిన జూలై, 17 ఏళ్ల తర్వాత భారీ పతనం

ఇంతకాలం నష్టాల్లో కొట్టుమిట్టాడిన మార్కెట్లు ఎట్టకేలకు ఈ రోజు కాస్త తేరుకున్నాయి. ఇంట్రాడేలో తీవ్ర ఒడుదుడుకులకు లోనైన నిఫ్టీ చివరకు లాభాల్లో ముగిసింది. ఈ రోజు ట్రేడ్‌లో నిఫ్టీ ఒక దశలో 11000 పాయింట్ల దిగువకు పడిపోయింది. మళ్లీ అక్కడి నుంచే రెట్టించిన ఉత్సాహంతో తేరుకుని మిడ్ సెషన్ తర్వాత 11,100 పాయింట్ల మార్కును దాటింది. ప్రధానంగా మెటల్, ఫార్మా, బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్లను దౌడు తీయించాయి. చివరకు నిఫ్టీ 33 పాయింట్ల లాభపడి 11,118 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 84 పాయింట్లు పెరిగి 37481 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో 28876 దగ్గర క్లోజైంది.

అయితే జూలై నెలలో పరమ చెత్త రికార్డును సొంతం చేసుకుంది నిఫ్టీ. 2002 తర్వాత అత్యంత మళ్లీ ఇప్పుడే అత్యంత భారీ పతనాన్ని చవిచూశాయి మార్కెట్లు. యెస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హీరోమోటోకార్ప్, టాటా స్టీల్ స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్‌టైన్మెంట్, యాక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, టైటన్, భారతి ఇన్ఫ్రాటెల్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో నిలిచాయి. ఇక సూచీల పరంగా చూస్తే.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం వరకూ పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా, రియాల్టీ రంగ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. ఆటో, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలల్లో లాభాలు కొనసాగాయి.

 Markets: Nifty log worst July in 17 Years

ఐఓసీకి రిజల్ట్స్ బూస్ట్
త్రైమాసిక ఫలితాల్లో ఆధాయంలో 4.2 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది ఇండియన్ ఆయిల్. నికర లాభం ఏకంగా 41 శాతం తగ్గింది. మార్జిన్లు నీరసించాయి. మార్జిన్లు కూడా 8.6 నుంచి 6.35 శాతానికి తగ్గాయి. అయినప్పటికీ స్టాక్ మాత్రం ఐదు శాతం వరకూ లాభపడింది. చివరకు స్టాక్ 4.3 శాతం నష్టంతో రూ.139.30 దగ్గర క్లోజైంది.

కాఫీడేకి కొత్త ఛైర్మన్
విజి సిద్ధార్థ్ ఆత్యహత్య ఉదంతం తర్వాత కాఫీ డే బాధ్యతలను మోసేందుకు తాత్కాలిక ఛైర్మన్‌గా ఎస్. వి. రంగనాధ్‌ను నియమించింది బోర్డ్. ఇప్పుడున్న కష్టకాలం నుంచి సంస్థను గట్టెక్కించేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలు అన్వేషించేందుకు ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వివిధ కారణాలతో స్టాక్ మరో 20 శాతం దిగొచ్చింది. చివరకు 20 శాతం నష్టంతో రూ.123 దగ్గర క్లోజైంది.

జీ ఎంటర్‌టైన్మెంట్ డౌన్
జీ ప్రమోటర్ సుభాష్ చంద్ర.. సెబీ ఛైర్మన్‌తో భేటీ అయి తమ సంస్థ ప్రణాళికలను వివరించారని, అప్పుల భారం, రుణదాతలతో వాళ్లు కుదుర్చుకున్న ఒప్పందం వంటి అంశాలు మాట్లాడినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపధ్యంలో స్టాక్ 6 శాతం నష్టపోయింది. చివరకు రూ.361 దగ్గర క్లోజైంది.

600 స్టాక్స్‌కు పోటు
ఈ రోజు 588 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. మిడ్, స్మాల్, మైక్రో క్యాప్, బ్లూచిప్ అనే తేడా లేకుండా ఈ స్టాక్స్ అన్నీ కుప్పకూలాయి. ఈ జాబితాలో అపెక్స్ ఫ్రోజెన్, అపోలో మైక్రో, అర్వింద్ మిల్స్, అరబిందో ఫార్మా, బాలక్రిష్ణ ఇండస్ట్రీస్, బిఏఎస్ఎఫ్, భారత్ ఫోర్జ్, గ్లెన్ ఫార్మా, గోద్రెజ్ ఆగ్రోవెట్, హెరిటేజ్, ఐఎఫ్‌బి ఆగ్రో, లక్ష్మీ మెషీన్ వర్క్స్ వంటి సంస్థలున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+