స్టాక్ మార్కెట్ ఎక్కడా కోలుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. రోజుకో కొత్త కనిష్ట స్థాయిని చేరుతూ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. నిఫ్టీ ఏకంగా ఆరు నెలల కనిష్టానికి జారుకుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 30 నెలల కనిష్టానికి దిగొచ్చింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత మరో భారీ పతనాన్ని చవిచూశాయి మార్కెట్లు. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్తో పాటు రిలయన్స్ వంటి స్టాక్స్లో అమ్మకం నిఫ్టీని నేలచూపులు చూసేలా చేసింది. ఒక్క ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలూ కుప్పకూలాయి. చివరకు 290 పాయింట్ల నష్టంతో 37397 దగ్గర సెన్సెక్స్ స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు దిగొచ్చి 11085 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 505 పాయింట్లు పడి 28972 వద్ద ముగిసింది.
ఈ ఉదయం 11214 దగ్గర స్థిరంగానే ప్రారంభమైన నిఫ్టీ 50 పాయింట్ల వరకూ లాభపడింది. అయితే మిడ్ సెషన్ తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో నిఫ్టీ 11072 పాయింట్ల కనిష్టం వరకూ పడిపోయింది. ఆఖరి వరకూ ఏ దశలోనూ కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు రెండూ మూడు శాతం వరకూ క్షీణించాయి. ముఖ్యంగా పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 5 శాతం పడిపోవడం ఆందోళనను పెంచింది. ఆ తర్వాత జాబితాలో మెటల్, మీడియా, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్స్, ఆటో స్టాక్స్ చేరాయి. భారతి ఎయిర్టెల్, టీసీఎస్, హెచ్ సి ఎల్ టెక్, విప్రో, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ టాప్ ఫైవ్ గెయినర్స్గా నిలిచాయి. యెస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హీరోమోటోకార్ప్, సన్ ఫార్మా స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

ఆర్బిఎల్ బ్యాంక్.. డీలా
ప్రధాన ప్రైవేట్ బ్యాంక్ ఆర్.బి.ఎల్. బ్యాంక్ వరుస పతనాలతో బెంబేలెత్తిస్తోంది. త్రైమాసిక ఫలితాల అనంతరం మరింత నీరసించిన బ్యాంక్ ఈ రోజు కూడా ఏకంగా 12 శాతం దిగొచ్చింది. అతి తక్కువ కాలంలో సుమారు 40 శాతం వరకూ స్టాక్ పతనం కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చివరకు స్టాక్ రూ.398.20 దగ్గర క్లోజైంది. ఇదే బాటలో ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా 7 శాతం పతనమై రూ.1330 దగ్గర స్థిరపడింది.
రిలయన్స్.. ఆరో రోజూ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ వరుసగా ఆరో రోజూ నష్టాల్లో ముగిసింది. రెండు నెలల్లో ఈ స్థాయిలో వరుస పతనాలు మళ్లీ ఇప్పుడే కనిపిస్తున్నాయి. రిజల్ట్స్ నుంచి ఈ స్టాక్ కూడా కిందికి దిగి వస్తోంది. చివరకు స్టాక్ 2.5 శాతం నష్టంతో రూ.1180 దగ్గర క్లోజైంది.
ఇండియాబుల్... గుబుల్..
సుబ్రమణియన్ స్వామి లేఖ తర్వాత ఇండియాబుల్స్ గ్రూప్ స్టాక్స్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఇప్పటికిప్పుడు ఈ గ్రూపుపై ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బంది లేనప్పటికీ స్టాక్ మాత్రం నీరసిస్తోంది. ఈ రోజు కూడా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 7 శాతం నష్టంతో రూ.523 దగ్గర క్లోజైంది. ఇదే గ్రూపనకు చెందిన ఐబీ రియల్ ఎస్టేట్ 15 శాతం, ఐబీ వెంచర్స్ 10 శాతం దిగొచ్చాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొండిబకాయిల దెబ్బ
తన త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన పటిష్టతను చూపిన బ్యాంక్.. మొండి బకాయిల విషయంలో మాత్రం నీరసించింది. నికర లాభం 155 శాతం, నికర వడ్డీ ఆదాయంలో 4 శాతం వృద్ధిని సంస్థ నమోదు చేసింది. అయితే మొండిబకాయిలు 5.61 నుంచి 5.79 శాతానికి పెరిగాయి. ఈ నేపధ్యంలో స్టాక్ 6.5 శాతం రూ.70.70 దగ్గర స్థిరపడింది.
హీరో మోటో... మరీ దారుణం
ప్రముఖ టూవీలర్ సంస్థ హీరోమోటో పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. స్టాక్ నిత్యం 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోతోంది. ఈ రోజు కూడా 6 శాతానికి పైగా నష్టంతో స్టాక్ క్లోజైంది. మార్కెట్ సమయం తర్వాత ఫలితాలను ఈ కంపెనీ వెల్లడించాల్సి ఉంది. చివరకు స్టాక్ 6.06 శాతం నష్టంతో రూ.2259 దగ్గర క్లోజైంది.
డాక్టర్ రెడ్డీస్ అంతంతే..
త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన కంపెనీ రెవెన్యూలో 3 శాతం, నికర లాభంలో 45 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్జిన్లు కొద్దిగా క్షీణించాయి. దీంతో స్టాక్ 3.5 శాతం నష్టంతో రూ.2562 దగ్గర క్లోజైంది.
కాఫీడేకు విజి సిద్ధార్థ దెబ్బ
సంస్థ ప్రమోటర్ విజి సిద్ధార్థ నిన్న రాత్రి నుంచి అనుమానాస్పద రీతితో కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం రాసిన లేఖలో ఆయన.. ఆవేదనను బోర్డుకు నివేదించారు. ఒత్తిళ్లను ఇక తట్టుకునే శక్తి లేక.. అన్నీ త్యజిస్తున్నాను అనేది లేఖ సారాంశం. దీంతో ఆయన ఏమైనా ఆఘాయిత్యానికి పాల్పడ్డారా అనే కోణం కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో కాఫీ డే స్టాక్ 20 శాతం నష్టంతో రూ.154 దగ్గర క్లోజైంది.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications