న్యూఢిల్లీ: పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తోంది. మూడు విడతల్లో రూ.2వేల చొప్పున రైతుల అకౌంట్లలో వేస్తారు. ఇప్పటికే తొలి విడతగా రూ.2వేలు రైతుల అకౌంట్లలో జమ అయింది. దేశవ్యాప్తంగా 14 కోట్లమంది రైతులు ఉన్నారు. పీఎం-కిసాన్ యోజన పథకం వారికి ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఇటీవల బడ్జెట్లో ఈ స్కీంకు మరిన్ని బడ్జెట్ ప్రకటిస్తారని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో నిధుల కొరత కారణమని భావించారు. కానీ ప్రభుత్వం కేటాయించిన రూ.75,000 కోట్లలో కొంత మొత్తం ప్రభుత్వానికి ఆదా కావడం గమనార్హం.

నాలుగు నెల్లలో రూ11,500 కోట్లు ఆదా
సమాచారం మేరకు, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వరుసగా కేవలం 11 శాతం, 9 శాతం మాత్రమే రైతుల డేటాను అప్ లోడ్ చేశారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ స్కీంలో చేరలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ - జూలై 2019 నాలుగు నెలలకు గాను దాదాపు 8 కోట్ల మంది రైతులకు ఈ ప్రయోజనం చేకురుతుంది. దీంతో రూ.5.8 కోట్ల అర్హత గల రైతులకు చేకూరలేదు. మొత్తంగా ప్రభుత్వానికి ఈ నాలుగు నెలల్లో రూ.11,500 కోట్లు ఆదా అయింది.

రూ.15వేల కోట్ల మేర ఆదా
అయితే గడిచిన కొద్ది ఈ స్కీం ప్రయోజనాలు వేగవంతమవుతుంటాయని (జూలై 31 నాటికి), అయినప్పటికీ ప్రభుత్వానికి రూ.15,000 కోట్ల మేర ఆదా కావొచ్చునని భావిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు చేరకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన జాబితాకు సంబంధించిన డేటా పూర్తిగా పెట్టకపోతే ఈ మొత్తం ఆదా అవుతుందని భావిస్తున్నారు.

ఆలస్యం అయ్యాక ఇచ్చేది లేదు...
జూలై 31వ తేదీ లోపు డేటా క్లియర్ చేసిన రైతులకు ఏప్రిల్ - జూలై పీరియడ్కు సంబంధించి రూ.2,000 జమ చేస్తామని ఆయా రాష్ట్రాలకు ముందే స్పష్టం చేశామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. జూలై 31వ తేదీ తర్వాత తయారైన డేటాకు ఆగస్ట్ - నవంబర్ పీరియడ్కు మాత్రమే జమ చేస్తామని చెప్పామని తెలిపింది. అంతకుముందు పీరియడ్ అమౌంట్ ఇవ్వబోమని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు 7.4 కోట్ల మంది రైతుల డేటాను ఇచ్చాయి. ఇందులో రూ.5.5 వ్యాలిడేట్ అయ్యాయి మిగతావి వివిధ స్టేజీల్లో ఉన్నాయని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది.

డేటా పూర్తిగా ఇవ్వని రాష్ట్రాలు...
బీహార్లో 1.64 కోట్ల మంది రైతులు ఉండగా, కేవలం 18 లక్షల డేటా వ్యాలిడేట్ అయింది. మధ్యప్రదేశ్లో 1.45 కోట్ల మంది రైతులు ఉండగా, 13 లక్షలు, మహారాష్ట్రలో 1.44 కోట్ల మంది రైతులు ఉండగా, 23 శాతం డేటా మాత్రమే అప్ లోడ్ అయింది. పీఎం - కిసాన్ స్కీం కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి డేటాను అందించలేదు. యూపీలో 2.33 కోట్లమంది రైతులు ఉండగా, దాదాపు సగం జాబితా అందించింది. గుజరాత్లో 53.4 శాతం (60 శాతం) డేటా ఇచ్చింది. కేంద్రం ధృవీకరించిన జాబితా కంటే పంజాబ్ ఎక్కువ డేటా ఇవ్వడం గమనార్హం.

రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్
ఇరవై రోజుల క్రితం సమర్పించిన డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు. జూన్ 25వ తేదీ నాటికి చూస్తే యూపీలో రెండు ఇన్స్టాల్మెంట్ల 1.20 కోట్లమందికి పీఎం కిసాన్ బీమా అమౌంట్ జమ అయింది. 34.92 లక్షల లబ్ధిదారులతో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర (31.75 లక్షలు), గుజరాత్ (29.80 లక్షలు), రాజస్థాన్ (28.26 లక్షలు) ఉన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications