ముంబై: ఇండిగో ప్రమోటర్స్ మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండిగో బోర్డు మెంబర్స్ కొందరు.. కో-ఫౌండర్ రాకేష్ గాంగ్వాల్ను వచ్చే వారం ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఇండిగో గవర్నెన్స్ లోపాలపై సెబీ, కార్పోరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించాయి. బోర్డు సభ్యులు, పలువురు ఉన్నతాధికారులకు సెబి సమన్లు జారీ చేయనుంది. ఇండిగో మదర్ కంపెనీ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్లో అమలు అవుతున్న ఒప్పందాలు, జరిగిన ఏర్పాట్లపై ఓ ప్రమోటర్ ఆరోపణలు చేసినందున, వాటిని క్షుణ్ణంగా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇన్సైడర్ ట్రేడింగ్ పైన సెబీ ఆరా తీస్తోంది. నిర్వహణ లోపాలపై లోతుగా దర్యాఫ్తు చేస్తోంది.
2015లో లిస్టైన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్లో సెబి నిబంధనలు అతిక్రమణకు గురవుతున్నాయనే అరోపణలు వచ్చాయి. కో-ప్రమోటర్ రాహుల్ భాటియాకు చెందిన ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ సంస్థలు నిర్వహించిన ట్రాన్సాక్షన్స్ అనుమానాస్పదంగా ఉన్నాయని మరో ప్రమోటర్ రాకేష్ గాంగ్వాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిని రాహుల్ భాటియా ఖండించారు. అయితే ఆరోపణలకు సమగ్ర వివరణ కావాలని కంపెనీని కార్పోరేట్ వ్యవహారాల శాఖ కోరింది. అతిక్రమణలు వెలుగుచూస్తే చర్యలు తీసుకుంటారు.

ఇండిగో ప్రారంభం నుంచి ప్రమోటర్ల గ్రూప్స్ మధ్య పారదర్శకత ఉందని ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (IGE) తెలిపింది. గంగ్వాల్ ఓ పరిమిత స్వభావి అని, స్వార్థపరుడని విమర్శించింది. సంస్థ ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోలేదని, అవసరమైతే ఆస్తులను అమ్మేద్దామనే ప్రతిపాదనలు చేసేవాడని, ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ వివాదాలను సృష్టించాడని ఆరోపించింది. రెండు గ్రూప్స్ ఎంతెంత పెట్టుబడి పెట్టాయో పూర్తి వివరాలు ఉన్నాయని తెలిపింది.
ఇండిగో ఈక్విటీలో రాకేష్ గంగ్వాల్, అతని ఫ్యామిలీకి 37%, రాహుల్ భాటియా, అతని కుటుంబ నిర్వహణలోని ఐజీఈ గ్రూప్నకు 38% వాటా ఉంది. ఈక్విటీలో 38 శాతం వాటాతో ఐజీఈ గ్రూప్, ఇండిగో ఎండీ, సీఈఓ, ప్రెసిడెంట్తో పాటు ఆరుగురు డైరెక్టర్లలో ముగ్గుర్ని నియమించే అధికారం చలాయిస్తోందని గంగ్వాల్ ఆరోపించారు. ఈ మేరకు సెబికీ లేఖ రాశాడు.
2005 నవంబరులో ఎయిర్బస్ నుంచి విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నపుడు కనీసం 50 మిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు ఐజీఈ గ్రూప్ తెలిపింది. కానీ నష్టభయంతో గంగ్వాల్ ముందుకు రాలేదని, ఐజీఈ ఒక్కటే మరో రూ.110 కోట్ల వరకు పెట్టుబడి పెట్టిందని పేర్కొంది.
కపిల్ భాటియా, రాహుల్ భాటియాలు ప్రారంభం నుంచి ఇండిగోకు వ్యక్తిగత రుణాలు ఇవ్వడమే కాక, బ్యాంకులకు గ్యారెంటీ ఇచ్చారని తెలిపింది. 2005-06లో రూ.143 కోట్ల గ్యారెంటీ ఇవ్వగా, 2009-10 నాటికి ఈ మొత్తం రూ.1100 కోట్లు పెరిగిందని, కానీ గంగ్వాల్ ఇచ్చింది రూ.15 కోట్లు లోపే అని తెలిపింది. 2012 వరకు కపిల్, రాహుల్ వ్యక్తిగత గ్యారెంటీలు ఇచ్చారని తెలిపింది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications