బడ్జెట్ ఎఫెక్ట్: కొత్త నాణేలు సరే .... పాత వాటి సంగతేమిటి?

ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తన తోలి బడ్జెట్ లో భాగంగా భారత్ లో కొత్త నాణేలను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించింది. రూపాయి నుంచి 20 రూపాయల వరకు కొత్త రూపంలో ఇవి ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఆర్ధిక వ్యవస్థ అవసరాలు తెలిసిన వారు కాబట్టి ప్రభుత్వం ... ఆర్ధిక శాఖ ఇలాంటి ప్రజోపకరణ నిర్ణయాలు తీసుకొంటాయి. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ఇప్పటికే చెలామణిలో ఉన్న నాణేల పరిస్థితి గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటె... రకరకాల అపోహలు, అనుమానాల మధ్య కొంత కాలంగా పౌరులు ఎవరు రూ 10 నాణేలను తీసుకోవటం లేదు. ముఖ్యంగా వర్తకుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆటోలు, కిరణా షాపులు, చికెన్ సెంటర్లు వంటి ఎలాంటి షాపుల్లోనైనా రూ 10 చెల్లందిగానే ఉంటోంది. దీంతో ప్రజలు కూడా వీటిని తీసుకొనేందు ముందుకు రావటం లేదు.

బ్యాంకులూ అంతే...

బ్యాంకులూ అంతే...

ఆర్ధిక వ్యవస్థకు పట్టుకొమ్మలు ఐన ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు సైతం నాణేలు తీసుకొనేందుకు వెంకడుతున్నాయి. పౌరుల నుంచి అన్ని రకాల నాణేలను అన్ని బ్యాంకులు తప్పని సరిగా తీసుకోవాల్సిందేనని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఎన్నీ సర్క్యూలర్లు జారీ చేసినా కూడా ఫలితం ఉండటం లేదు. డిపాజిట్ చేసేందుకు తెచ్చిన నాణేలను దేశం లోని ఏ ఒక్క బ్యాంకు కూడా తిరసరించకూడదు అని ఈ నెల తోలి వరం లో కూడా రిజర్వు బ్యాంకు సర్కులర్ జారీ చేసింది. ఐన కూడా బ్యాంకులు స్పందించటం లేదు. అదేంటి అని బ్యాంకులను నిలదీస్తే .... పౌరులు ఎవరూ నాణేలను తీసుకొనేందుకు అంగీకరించటం లేదు. మా వద్దకు వచ్చిన నాణేలు అలాగే పోగుపడిపోతున్నాయి. వాటిని మెం ఎవరికి తిరిగి ఇవ్వాలని ప్రశ్నిస్తున్నాయి. కర్ర పెత్తనం చేసే రిజర్వు బ్యాంకు కూడా మా వద్ద నుంచి నాణేలను తిరిగి తీసుకోదని.. అలాంటప్పుడు మేమెలా నాణేలను స్వీకరించాలి అని ఒక బ్యాంకు మేనేజర్ వాపోయారు.

చిల్లర కొరత :

చిల్లర కొరత :

ఒకప్పుడు మార్కెట్ లో చిల్లర కొరత పెద్ద ఇబ్బందిగా ఉండేది. ఏ లావాదేవీ కైనా చిల్లర దొరక్క అటు ప్రజలు, ఆపసోపాలు పడేవారు. ఇందుకోసం వ్యాపారాలు కమిషన్ ఇచ్చి మరీ రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందిన ఏజెంట్ల ద్వారా చిల్లర సమీకరించుకొనేవారు. బిచ్చగాళ్ల నుంచి కూడా ఇదే పధ్ధతి లో చిల్లర జమ చేసుకోవటం తెలిసిందే. ఐదారేళ్ళ కింద మన హైదరాబాద్ లో చిల్లర కొరత ఏరపడటం వాళ్ళ వైన్ షాపులు, కొంత మంది చిన్న వ్యాపారాలు పాపేరుపై స్టాంప్ వేసి వాటినే నగదుగా చెలామణి చేసిన సందర్భాలు ఉన్నాయ్. అయితే ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారిపోవడం చూస్తున్నాం.

డిజిటల్ పేమెంట్స్ ప్రభావం:

డిజిటల్ పేమెంట్స్ ప్రభావం:

మంచో చెడో... పెద్ద నోట్ల తర్వాత దేశంలో డిజిటల్ ప్రెమెంట్స్ పెరిగిపోయాయి. ప్రెటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆప్ ల రాక తో ఎంత చిన్న మొత్తంగా ఒకరినుంచి మరొకరికి నగదు బదిలీ చేసుకోవడం సులభం అయిపోయింది. ఆఖరికి పని పూరి బండి వాళ్ళు కూడా ఈ ఆప్ లను వినియోగిస్తున్నారు. దీంతో ప్రజలకు చిల్లర (నాణేల ) అవసరం తగ్గి పోతోంది. ఈ విషయాన్నీ ప్రభుత్వం గుర్తించి తదనుగూనంగా నిర్ణయం తీసుకొంటే మంచిదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

రూపాయి నుంచి ఇరవై వరకు...

రూపాయి నుంచి ఇరవై వరకు...

ఇప్పటి వరకు దేశం లో చెలామణి లో ఉన్న నాణేలు 50 పైసలు, రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలు కాగా... కొత్త మార్కెట్ లోకి రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలతో పాటు 20 రూపాయల నాణేన్ని కూడా ప్రవేశ పెట్టనున్నట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం 50 పైసల నాణేలు పెద్దగా కనిపించటం లేదు. 10 రూపాయల నాణేన్ని ప్రజలు తీసుకోవట్లేదు. వెల్లడించక పోయిన త్వరలో 50 పైసల నాణేలు కూడా చలామణి నుంచి వెళ్లి పోతాయనిపిస్తోంది. కొత్తగా ప్రవేశ పెట్టె నాణేలు రూపాయి నుంచే ప్రారంభం అవుతుండటం దీనికి సూచనగా అనిపిస్తోంది. మరి కొత్తగా వచ్చే నాణేలకు ఆదరణ ఎంత మేరకు ఉంటుందో చూడాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+