పెరిగిన దిగుమతి సుంకంతో డీలా పడ్డ బంగారు వ్యాపారులు..కొండెక్కిన పుత్తడి ధరలు

ఢిల్లీ: పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బంగారంపై దిగుమతి సుంకం పెంచడంతో ఒక్కసారిగా బంగారం ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి.దేశీయ కొనుగోలు దారుల నుంచి పసిడికి తెగ డిమాండ్ ఏర్పడింది. దీంతో డీలర్లు గత మూడేళ్లలో ఎప్పుడే లేనంతగా తగ్గింపు ధరతో పుత్తడిని అమ్మాల్సి వచ్చింది. భారత్‌లోని డీలర్లు రూ. 2.053 తగ్గింపు ధరతో బంగారంను ఇచ్చినట్లు సమాచారం. 2016 తర్వాత ఈ స్థాయిలో తగ్గించి ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.

శుక్రవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ బంగారంపై దిగుమతి సుంకాన్ని 12.5శాతం వరకు పెంచుతూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఇది 10శాతంగా ఉండేది. కేంద్రం ప్రకటించిన ఈ పెంపుతో రిటెయిల్ డిమాండ్ దెబ్బతీయడమే కాదు... స్మగ్లింగ్‌కు కూడా ఊతమిచ్చినట్లువుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బంగారంను తగ్గించి ఇస్తున్నప్పటికీ ప్రజలు పసిడి కొనుగోలుకు ఆసక్తి చూపలేదని ఓ బంగారం దుకాణం నడిపే ఓనర్ చెప్పాడు.

Higher Import Duty On Gold After Budget Leaves Traders Confused

ఇక బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్రమంత్రి ప్రకటనతో పుత్తడి ధర 10 గ్రాములపై 2శాతం ధర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.35,100కు పెరిగింది. మరోవైపు గత ఆరువారాల్లో స్థానికంగా బంగారు ధరలు 11శాతం పెరిగినట్లయ్యింది. ఇదిలా ఉంటే ముంబైలోని బంగారు వ్యాపారులు బడ్జెట్ ప్రకటన ఉన్న నేపథ్యంలో పసిడిని కొనలేదు. దిగుమతి సుంకం తగ్గుతుందనే ప్రకటన కేంద్రం నుంచి వస్తుందన్న వారి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. అయితే కేంద్రం ఒక్కసారిగా దిగుమతి సుంకం పెంచడంతో షాక్‌కు గురైన వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+