నల్లధనాన్ని కట్టడి చేయాలి, విదేశాల్లో ఉంటున్న బ్లాక్ మనీని వెనక్కి తెప్పించాలి, నగదు లావాదేవీలకు పూర్తిస్థాయిలో నియంత్రించాలి.. ఇవీ గత ఐదేళ్లుగా ప్రభుత్వ లక్ష్యాలు. వీటిల్లో ఎంత వరకూ సక్సెస్ సాధించారు అనే అంశాన్ని పక్కకుబెడితే ఈ బడ్జెట్లో మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్రం. అదేంటంటే ఒక బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి కోటి రూపాయల కన్నా ఎక్కువ నగదు తీసుకుంటే 2 శాతం పన్నును విధిస్తారు. ఇక వ్యక్తులే కాదు.. కంపెనీల కూడా నగదులో పెద్ద ఎత్తున లావాదేవీలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. సామాన్యులు అంతంతమొత్తాన్ని తీసే అవకాశం ఉండదు కాబట్టి మనకు సమస్య లేదు కానీ.. కంపెనీలకు, కోటీశ్వరులకు మాత్రం ఇది ఇబ్బందికర విషయమే.

మరో మెలిక
బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించకపోయినా కేంద్రం మరో కొత్త మెలికను పెట్టింది. అదేంటంటే.. ఇకపై ఇతరుల అకౌంట్లో మనం వాళ్ల అనుమతి తీసుకోకుండా నగదును డిపాజిట్ చేయలేము. అంటే ఇక మనం ఎవరి ఖాతాలో అయినా డబ్బును డిపాజిట్ చేయాలంటే వాళ్ల అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందనేది కేంద్రం మాట. అయితే ఎంత మొత్తం పరిమితి దాటితే వాళ్ల అనుమతి కావాలి, అనుమతి ఎలా ఇవ్వాలి అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఒక వేళ ఇరు వర్గాలకూ తెలిసి లావాదేవీ జరుగుతున్నా.. అనుమతి పొందాల్సిన పరిస్థితిని కేంద్రం తెచ్చింది.

ఎందుకీ తలనొప్పి
అయితే జన్ ధన్ తెచ్చిన ఈ తంటతో కేంద్రం ఈ కొత్త మెలిక పెట్టింది. ఎందుకంటే డీమానిటైజేషన్ సమయంలో కొన్ని వేలాది జన్ ధన్ ఖాతాల్లో అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా బయటి వ్యక్తులు నగదును డిపాజిట్ చేశారు. ఎప్పటికో కానీ ఖాతాదార్లకు ఈ విషయం తెలియలేదు.
దీంతో ఇలాంటి లూప్ హోల్స్ను అరికట్టేందుకు కేంద్రం ఈ తరహా మార్గదర్శకాలను త్వరలో బ్యాంకులకు ఇవ్వబోతోంది.

నెంబర్ ఉంటే చాలు...
ఇప్పుడున్న పరిస్థితుల్లో అవతలి వ్యక్తికి చెందిన బ్యాంక్ ఖాతా నెంబర్ తెలిస్తే.. ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసే సౌలభ్యం ఉంటుంది. నేరుగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా క్యాష్ డిపాజిట్ మెషీన్లలో కూడా నగదును జమ చేసే వీలుంది. ఈ లోపాన్ని ఆసరగా తీసుకుని గతంలో డిపాజిట్లు జరిగిన ఉదంతాలు కేంద్రం దృష్టికి వచ్చాయి.
అయితే ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. మాకు తెలియకుండా ఎవరో మా ఖాతాలో డబ్బు జమ చేశారు అని చెప్పి తప్పించుకునే అవకాశాన్ని కూడా కేంద్రం మూసేయబోతోంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంత మంది ఈ మాటలు చెప్పి తప్పించుకోవాలని చూస్తారు. ఇప్పుడు ఆ రూట్ను క్లోజ్ చేసేశారు. అయితే రాబోయే రోజుల్లో ఏదైనా పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ఉద్దేశంతోనే కేంద్రం ఇలా ముందు జాగ్రత్తలు తీసుకొంటోందా అనే అనుమానాలూ ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications