న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో ఏయే రంగాలకు ఊరట కల్పిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది పక్కన పెడితే, అన్ని రంగాలవారు కూడా తమకు ఏం కావాలో కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా హెల్త్ ఇండస్ట్రీ, అలాగే కార్మిక వర్గాలు కూడా బాగానే ఆశలు పెట్టుకున్నాయి.
ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాలని, ఇందుకోసం మరిన్ని నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య రంగం కోరుకుంటోంది. ప్రధాని మోడీ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ అద్భుతమని, అయితే దీనికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఆయుష్మాన్ భారత్కు నిధుల కేటాయింపు అంత సులభం కాదని, కానీ అది అవశ్యం అంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్య రంగానికి 1.2 శాతం కేటాయిస్తున్నారని, రానున్న రెండు మూడేళ్లలో ఈ రంగానికి నిధులను దాదాపు మూడు రెట్లు పెంచుతారని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. బలమైన ప్రాథమిక సంరక్షణ వ్యవస్థ అవసరమని చెబుతున్నారు. శిక్షణ పొందిన వైద్యుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. శిశు పోషణ, మహిళల ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించేందుకు బడ్జెట్లో కేటాయింపులు ఉండాలంటున్నారు.

ఆరోగ్య భారత్ లక్ష్యంగా మెడికల్, ఫార్మా ఇండస్ట్రీ పని చేస్తోందని, దీనిపై సరైన అవగాహన కల్పించాలని కోరుతున్నారు. రూ.2 లక్షల కోట్ల రెవెన్యూ కలిగిన హెల్త్ ఇండస్ట్రీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరమని అంటున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ (EMS) ఇండస్ట్రీ 90 శాతం ప్రభుత్వ నియంత్రణలో ఉందని, బడ్జెట్లో నిధుల కేటాయింపు అత్యవసరమని, దీంతో దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా సకాలంలో వైద్య సేవలు అందించవచ్చునని చెబుతున్నారు. తలసరి అంబులెన్సుల నిష్పత్తి ఒకటికి లక్షా నలభై వేలకు పైగా ఉందని, ఇది ఒకటికి అరవై వేల నిష్పత్తిగా ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. వైద్య సాంకేతిక నిపుణుల శిక్షణ కోసం నైపుణ్య కేంద్రాలు అవసరమని చెబుతున్నారు. రోడ్లపై అంబులెన్స్ సేవలు, రైళ్లకు అత్యవసర మెడికల్ యూనిట్లు పెరగాలంటున్నారు.
రానున్న 2025 నాటికి ఆరోగ్య వ్యయం జీడీపీలో 1.15 శాతం నుంచి 2.5 శాతానికి పెరగాలని కోరుకుంటున్నారు. ప్రతి 51వేల మందికి ఒక హెల్త్ కేర్ ఉందని, కాబట్టి వీటిని పెంచాలంటున్నారు. ఆయుష్మాన్ భారత్ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆసుపత్రులను కూడా పెంచాలని కోరుతున్నారు. హోమియోపతిలో భారత్ వరల్డ్ లీడర్గా ఉందని, ఇంటర్నేషనల్ మెడికల్ కమ్యూనిటీ ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications