న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,565 కోట్ల విలువైన ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ (ITC) క్లెయిమ్స్ గుర్తించినట్లుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకు సంబంధించి జీఎస్టీ అధికారులు 535 కేసులు బుక్ చేశారని పేర్కొన్నారు. 40మందిని అరెస్టు చేశారన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1,620 కేసులు గుర్తించామని, ఈ విలువ మొత్తం రూ.11,251 కోట్లుగా ఉందని తెలిపారు. 154 మంది అరెస్టయ్యారని ఆమె లోకసభలో వెల్లడించారు.

జీఎస్టీ ఎగవేతలపై కఠిన చర్యలు
జీఎస్టీ అమలు చేసిన తొలి ఏడాది (2017 జూలై నుంచి 2018 మార్చి) ఐదు కేసులకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐటీసీ విలువ రూ.12.67 కోట్లు అన్నారు. జీఎస్టీ ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి స్పందిస్తూ... 2018-19లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 6,801 బ్యాంక్ కేసుల్లో రూ.71,542.94 కోట్ల ఫ్రాడ్ జరిగిందన్నారు.

బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్స్ విలువ రూ.14,578 కోట్లు
బ్యాంకింగ్ వ్యవస్థలో గత ఏడాది క్లెయిమ్ చేయని డిపాజిట్ల విలువ 26.8 శాతం పెరిగి, రూ.14,578 కోట్లుగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వీటి విలువ రూ.11,494 కోట్లు, 2016లో రూ.8,928 కోట్లుగా ఉందని తెలిపారు. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోనే క్లెయిమ్ చేయని డిపాజిట్స్ వ్యాల్యూ రూ.రూ.2,156.33 కోట్లుగా ఉందన్నారు.

ఇన్సురెన్స్ రంగంలో రూ.రూ.16,887 కోట్లు
అదే సమయంలో ఇన్సురెన్స్ సెక్టార్లో క్లెయిమ్ చేయని మొత్తం 2018 సెప్టెంబర్ చివరి నాటికి రూ.16,887.66 కోట్లుగా ఉందని, నాన్ లైఫ్ ఇన్సురెన్స్ రూ.989.62 కోట్లుగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ (LIC) అమౌంట్ రూ.12,892 కోట్లుగా ఉందన్నారు. బ్యాంక్స్, ఇంన్సురెన్స్ సెక్టార్లో మొత్తం దాదాపు రూ.32,000 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్స్ ఉన్నాయన్నారు. ఆర్బీఐ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లో సెక్షన్ 26ఏ ప్రకారం డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (DEAF) స్కీం కింద ఇలా పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం క్లెయిమ్ చేయకుండా ఉన్న డిపాజిట్స్, వాటి వడ్డీలతో కలిపి DEAFకు బదిలీ చేస్తారన్నారు. క్లెయిమ్ చేయని డిపాజిట్స్పై కస్టమర్ డిమాండ్ చేస్తే వాటిని వడ్డీతో పాటు చెల్లించాలని, ఆ తర్వాత DEAF నుంచి రీఫండ్ కోరాలని చెప్పారు. ఈ డిపాజిట్స్ పైన వడ్డీ రేటును ప్రారంభంలో ఏడాదికి 4 శాతంగా ఉండగా, 2018 జూలై నుంచి 3.5 శాతంగా ఉంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications