న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,565 కోట్ల విలువైన ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ (ITC) క్లెయిమ్స్ గుర్తించినట్లుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకు సంబంధించి జీఎస్టీ అధికారులు 535 కేసులు బుక్ చేశారని పేర్కొన్నారు. 40మందిని అరెస్టు చేశారన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 1,620 కేసులు గుర్తించామని, ఈ విలువ మొత్తం రూ.11,251 కోట్లుగా ఉందని తెలిపారు. 154 మంది అరెస్టయ్యారని ఆమె లోకసభలో వెల్లడించారు.

జీఎస్టీ ఎగవేతలపై కఠిన చర్యలు
జీఎస్టీ అమలు చేసిన తొలి ఏడాది (2017 జూలై నుంచి 2018 మార్చి) ఐదు కేసులకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐటీసీ విలువ రూ.12.67 కోట్లు అన్నారు. జీఎస్టీ ఎగవేతలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి స్పందిస్తూ... 2018-19లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 6,801 బ్యాంక్ కేసుల్లో రూ.71,542.94 కోట్ల ఫ్రాడ్ జరిగిందన్నారు.

బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్స్ విలువ రూ.14,578 కోట్లు
బ్యాంకింగ్ వ్యవస్థలో గత ఏడాది క్లెయిమ్ చేయని డిపాజిట్ల విలువ 26.8 శాతం పెరిగి, రూ.14,578 కోట్లుగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వీటి విలువ రూ.11,494 కోట్లు, 2016లో రూ.8,928 కోట్లుగా ఉందని తెలిపారు. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోనే క్లెయిమ్ చేయని డిపాజిట్స్ వ్యాల్యూ రూ.రూ.2,156.33 కోట్లుగా ఉందన్నారు.

ఇన్సురెన్స్ రంగంలో రూ.రూ.16,887 కోట్లు
అదే సమయంలో ఇన్సురెన్స్ సెక్టార్లో క్లెయిమ్ చేయని మొత్తం 2018 సెప్టెంబర్ చివరి నాటికి రూ.16,887.66 కోట్లుగా ఉందని, నాన్ లైఫ్ ఇన్సురెన్స్ రూ.989.62 కోట్లుగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ (LIC) అమౌంట్ రూ.12,892 కోట్లుగా ఉందన్నారు. బ్యాంక్స్, ఇంన్సురెన్స్ సెక్టార్లో మొత్తం దాదాపు రూ.32,000 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్స్ ఉన్నాయన్నారు. ఆర్బీఐ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లో సెక్షన్ 26ఏ ప్రకారం డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (DEAF) స్కీం కింద ఇలా పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం క్లెయిమ్ చేయకుండా ఉన్న డిపాజిట్స్, వాటి వడ్డీలతో కలిపి DEAFకు బదిలీ చేస్తారన్నారు. క్లెయిమ్ చేయని డిపాజిట్స్పై కస్టమర్ డిమాండ్ చేస్తే వాటిని వడ్డీతో పాటు చెల్లించాలని, ఆ తర్వాత DEAF నుంచి రీఫండ్ కోరాలని చెప్పారు. ఈ డిపాజిట్స్ పైన వడ్డీ రేటును ప్రారంభంలో ఏడాదికి 4 శాతంగా ఉండగా, 2018 జూలై నుంచి 3.5 శాతంగా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications