రిటైల్ ఇన్వెస్టర్లకు శుభవార్త!

చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లకు శుభవార్త. వీరికి మరింతగా పన్ను ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టిన వారికి పన్ను ప్రయోజనాలు కల్పించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆ రెండు ఫండ్స్.. సీపీఎస్ఈ, భారత్ -22 ఈటీఎఫ్. ప్రస్తుతం ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ ఎస్ ఎస్) కల్పిస్తున్న ప్రయోజనాన్ని ఈ రెండు ఈటీఎఫ్ లలో పెట్టుబడికి కూడా వర్తింపజేసే అంశంపై అభిప్రాయం తెలియజేయాలంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కు పెట్టుబడులు, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ శాఖ (దీపం) లేఖ రాసింది. ఒక వేళ సీబీడీటీ ఓకే చెబితే 2019-20 బడ్జెట్ లోనే ప్రకటన వచ్చే విధంగా తుది ప్రణాళికపై పని చేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఈఎల్ఎస్ఎస్ ప్రయోజనాలను ఈటీఎఫ్ లకు అందజేసినా ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ ఈటీఎఫ్ లలో రిటైల్ పెట్టుబడులు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అంతే కాకుండా గృహ పొదుపు మొత్తాలు పెట్టుబడుల దిశగా సాగడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Good news for retail investors in this budget

* ప్రస్తుతం ఈఎల్ ఎస్ ఎస్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులపై సెక్షన్ 80 సి కింద గరిష్టంగా రూ. 1.50 లక్షల పన్ను మినహాయింపు లభిస్తోంది. అయితే వీటికి మూడేళ్ళ లాకిన్ పీరియడ్ ఉంటుంది.
* ప్రభుత్వం ప్రస్తుతం సీపీఎస్ఈ ఈటీఎఫ్, భారత్-22 ఈటీఎఫ్ లను నిర్వహిస్తోంది. ఇవి స్టాక్ ఎక్స్చేంజిల్లో నమోదయ్యాయి.
* ఈ ఈటీఎఫ్ లు కూడా మ్యూచువల్ ఫండ్ స్కీం లాంటివే. ఇవి ప్రభుత్వ రంగ కంపెనీలకు సంబంధించినవి.
* ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు, బీమా కంపెనీలు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ తో కూడిన ఈటీఎఫ్ ను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
* ఇప్పటివరకు తెచ్చిన రెండు ఈటీఎఫ్ లకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్ధిక రంగ ఈటీఎఫ్ పై దృష్టిసారిస్తోంది.
*భారత్-22 ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.32,900 కోట్లు సమీకరించింది. అలాంటి సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా ఐదు విడతల్లో రూ. 38,000 కోట్లు సమీకరించింది.
* దీన్ని బట్టి ఈ ఈటీఎఫ్ లపై రిటైల్ ఇన్వెస్టర్లకు ఎంతగా ఆసక్తి ఉన్నదో తెలుసుకోవచ్చు. వీటికి పన్ను ప్రయోజనాలు కూడా కల్పిస్తే ఇంకా ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తారని అంచనా వేస్తున్నారు.
* పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం గత ఆర్ధిక సంవత్సరంలో రూ. 85,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సర లక్ష్యం రూ. 90,000 కోట్లుగా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+