నీరవ్ మోడీ PNB స్కాం కంటే మరో పెద్ద కుంభకోణం
వడోదర: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు (PNB స్కాం) నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు రూ.13,700 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ PNB స్కాం కంటే అతి పెద్ద కుంభకోణం మరొకటి వెలుగు చూసిందా? అంటే అవుననే అంటున్నారు. పీఎన్బీ కంటే పెద్ద స్కాం చోటు చేసుకుందని ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. వడోదరకు చెందిన స్టెర్లింగ్ బయోటిక్ లిమిటెడ్(SBL) ప్రమోటర్లు అయిన సందేశరా సోదరులు పలు బ్యాంకులకురూ.14 వేల కోట్ల కుచ్చుటోపీ పెట్టారట.
SBL మరియు సందేశరా గ్రూప్ ప్రమోటర్లు నితిన్ సందేశర, చేతన్ సందేశర, దీప్తి సందేశరలు పెద్ద మొత్తంలో బ్యాంకు మోసాలకు పాల్పడ్డారు. రూ. 5,393 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017లో వీరిపై ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. భారత్లోని బ్యాంకుల నుంచే కాకుండా విదేశాల్లోని భారతీయ బ్యాంకుల బ్రాంచీల నుంచి కూడా వీరు దాదాపు రూ.9000 కోట్ల రుణాలు తీసుకున్నారట.
భారతీయ బ్యాంకుల నుంచి దేశీయ, విదేశీ కరెన్సీల్లో రుణాలు తీసుకున్నారు. ఆంధ్రా బ్యాంక్, యూకో బ్యాంక్, ఎస్బీఐ, అలహాబాద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకుల కన్సార్టియం నుంచి రుణాలు పొందినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
డబ్బు సంపాదించడం ఎలా?, మీకు ఫేస్బుక్ ఫ్రీగా చెప్పనుంది
తప్పుడు పత్రాలతో ఈ రుణాలు పొంది వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని తేలింది. ఈ కేసులో స్టెర్లింగ్ బయోటిక్కు చెందిన రూ.9,778 కోట్ల విలువైన ఆస్తులు ఈడీ జఫ్తు చేసింది. జఫ్తు చేసిన వాటిలో నైజీరియా ఆయిల్ రిగ్స్, షిప్స్, బిజినెస్ జెట్, లండన్ ప్లష్ ఫ్లాట్ ఉన్నాయి. ఇదే కేసులో అంతకుమందు రూ.4,730 కోట్లు అటాచ్ చేశారు.