మైండ్ ట్రీ కొనుగోలు పూర్తి, కొత్త బాస్ ఎవరు?

బెంగళూరు కేంద్రంగా సాఫ్ట్ వేర్ సేవలు అందించే మైండ్ ట్రీ కంపెనీని.... విభిన్న రంగాల్లో సేవలు అందించే లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ ) కొనుగోలు చేసింది. మైండ్ ట్రీ లో 60 % వాటా కొనుగోలు చేయడం తో ఇకపై ఈ కంపెనీ ఎల్ అండ్ టీ సొంతం అయినట్లే. భారత దేశ సాఫ్ట్ వేర్ రంగం లోనే మొట్ట మొదటి బలవంతపు టేకోవర్ గా ఈ లావాదేవీ నిలుస్తోంది. ఫౌండర్స్ అంగీకరించక పోయిన కూడా మైండ్ ట్రీ కంపెనీని తనకు నచ్చినట్లుగా కొనుగోలు చేయడంలో ఎల్ అండ్ టీ సఫలమైంది.

ఓపెన్ ఆఫర్ ద్వారా పబ్లిక్ షేర్ హోల్డర్స్ నుంచి దాదాపు 5. 09 కోట్ల ఈక్విటీ షేర్స్ ను కొనుగోలు చేసి ఈ నెల 26వ తేదీన ఎల్ అండ్ టీ ఈ లావాదేవిని పూర్తి చేసింది. ఇందుకోసం ఏకంగా రూ 4,989 కోట్లను వెచ్చించింది. మైండ్ ట్రీ ని ఎలాగైనా దక్కించు కోవాలన్న పట్టుదలతో ఏడాది క్రితమే ఎల్ అండ్ టీ .... మైండ్ ట్రీ లో వీజీ సిద్ధార్థ కు ఉన్న 20% కి పైగా వాటా ను కొనుగోలు చేసింది. అక్కడి నుంచి మైండ్ ట్రీ ప్రమోటర్లు కు పొగ పెట్టడం ప్రారంభించిన ఎల్ అండ్ టీ ఎట్టకేలకు తన పంతాన్ని నిలబెట్టుకోంది. ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎం నాయక్ నేతృత్వంలోనే మొత్తం ప్రక్రియ పూర్తయ్యింది.

Who is new boss of MindTred after L & T stake 60 percent stake

మైండ్ఒ ట్రీ కంపెనీ లో ఒక్కో షేర్ కు రూ 980 చొప్పున కొనుగోలు చేసిన ఎల్ అండ్ టీ .. ఇప్పటి వరకు దాదాపు రూ 10,000 కోట్లను వెచ్చించింది.

గతంలో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ దిగ్గజం సత్యం కంప్యూటర్స్ సంక్షోభంలో ఉన్నప్పుడు దానిని కూడా కొనుగోలు చేయాలనీ ఎల్ అండ్ టీ ప్రయత్నించింది. కానీ బిడ్డింగ్ లో చాల తక్కువ మొత్తం కోట్ చేయడం తో పోటీ లో విఫలమైంది. మెరుగైన రేట్ కోట్ చేసిన మహీంద్రా గ్రూప్ కంపెనీ టెక్ మహీంద్రా దాన్ని సొంతం చేసుకోగలిగింది. అయితే అందరు భయపడ్డట్లు సత్యం కంప్యూటర్స్ ఏమీ మహీంద్రా గ్రూప్ ను ఇబ్బంది పెట్టలేదు సరికదా టెక్ మహీంద్రా సేవలు ప్రపంచ వ్యాప్తం చేయడం లో సఫలీకృతం ఐంది.

అందుకే, ఈ సారి ఎలాగైనా అవకాశాన్ని చేజారనీయ రాదని భావించిన నాయక్... మైండ్ ట్రీ కొనుగోలులో పట్టుదలకు పోయారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం మైండ్ ట్రీ కొత్త సారథి కోసం ఎల్ అండ్ టీ వేట ప్రారంభించింది. వీలైనంత త్వరగా ప్రమోటర్, సీఈఓ ఐన రోస్టో రావణన్ ని బయటకు పంపించేయాలి ఎల్ అండ్ టీ తలపిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ లోపలి వ్యక్తితో పాటు బయటి వారిని కూడా ఇందుకోసం ఇంటర్వ్యూ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త సీఈఓ ను నియమించటమే కాకుండా పాత ప్రమోటర్లు నియమించిన కీలక అధికారులను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఎల్ అండ్ టీ సొంత సాఫ్ట్ వేర్ కంపెనీ ఐన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లో ప్రస్తుతం కొనుగోలు చేసిన మైండ్ ట్రీ కంపెనీని విలీనం చేస్తారట. ఒకటి రెండేళ్ల లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే , మైండ్ ట్రీ కి ఇప్పటి వరకు ఉన్న కస్టమర్లు వారి కాంట్రాక్టు లను రెన్యువల్ చేసుకొనేందుకు అవకాశం ఉండటం తో ఈ ఏడాది మైండ్ ట్రీ రెవిన్యూ, లాభాలు తగ్గే అవకాశాలు కొట్టి వేయలేమని స్టాక్ మార్కెట్ అనలిస్టులు పేర్కొంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+