ముంబై/హైదరాబాద్ : నిర్మాణాలకు అత్యంత కీలకమైంది సిమెంట్. దేశ వ్యాప్తంగా సిమెంట్ తయారీ పరిశ్రమలు అనేకం ఉన్నప్పటి దానికి డిమాండ్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీ తో పాటు హైదరాబాద్ వంటి మహానగరాల్లో సిమెంట్ ధర ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇతర నగరాల్లో సిమెంట్ ధర కాస్త తక్కువగా ఉన్నప్పటికి నిర్మాణాలు అతి వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రం సిమెంట్ కంపెనీల మద్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది.

మూడో త్రైమాసికంలో పుంజుకొనే అవకాశం..! సిమెంట్ అమ్మకాలపై కంపెనీల ఆశాభావం..!!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) సిమెంట్ డిమాండ్లో వృద్ధి 7 శాతం నమోదుకావడానికి అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రాజెక్టుల పనులు నెమ్మదిగా సాగిన కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సిమెంట్ డిమాండ్ అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. అయితే వర్షాకాలం ముగిసిన తర్వాత మూడో త్రైమాసికంలో గిరాకీ పుంజుకోవడానికి అవకాశం ఉందని, మొత్తంగా చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం డిమాండ్లో 7 శాతం వృద్ధి నమోదుకావచ్చని తెలిపింది.

పెరిగిన సిమెంట్ ఉత్పత్తి..! రెండవ త్రైమాసికంలో వర్షాల కారణంగా పడిపోయిన కొనుగోళ్లు..!!
క్రితం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 13 శాతంగా నమోదైంది. గత ఏప్రిల్లో సిమెంట్ ఉత్పత్తి 28.7 మిలియన్ టన్నులుగా ఉంది. మార్చితో పోల్చితే ఇది 13.3 శాతం తక్కువ. 'ఎన్నికల కారణంగా మొదటి త్రైమాసికంలో ప్రాజెక్టుల పనులు నెమ్మదిగా సాగాయి. రెండో త్రైమాసికం విషయానికొస్తే.. వర్షాలతో డిమాండ్ తక్కువగా ఉంటుంది. మూడో త్రైమాసికం నుంచి డిమాండ్ పుంజుకుంటుందని భావిస్తున్నాం. గృహ నిర్మాణం, రోడ్లు, రైల్వే, నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి డిమాండ్ ఏర్పడనుంది' అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సభ్యసాచి మజుందార్ తెలిపారు.

మార్జిన్ల రికవరీ..! ఆశాజనకంలో కంపెనీలు..!!
కంపెనీల లాభదాయకత విషయానికొస్తే.. మొదటి త్రైమాసికంలో అధిక స్థాయిలో సిమెంట్ ధరలు ఉండటం, తక్కువ స్థాయిలో విద్యుత్ చార్జీలు, ఇంధనం, సరుకు రవాణా వ్యయాలు ఉన్నందు వల్ల మార్జిన్ల రికవరీకి అవకాశం ఏర్పడింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు 18-20 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని జత చేసుకునే అవకాశం ఉందని ఇక్రా అంచనా వేస్తోంది. అధిక సప్లయ్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామర్థ్య వినియోగం 71 శాతం స్థాయిలో ఉండనుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 69 శాతంగా ఉంది.

ఢిల్లీ, హైదరాబాద్లో అధిక ధర..! డిమాండ్ కూడా ఎక్కువే..!!
గత ఏప్రిల్లో సిమెంట్ ధరలు ఇంతకు ముందు సంవత్సరం ఇదేనెలకన్నా ఎక్కువగా ఉన్నాయి. అన్ని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీ, హైదరాబాద్ ధరలు 20-25 శాతం, ముంబైలో 10 శాతం పెరిగాయి. మార్చిలోనే కంపెనీలు సిమెంట్ ధరలను పెంచాయి. ఏప్రిల్లో స్థిరపడ్డాయి. అయితే డిమాండ్ తగ్గడం, సరఫరాపరమైన ఒత్తిడుల కారణంగా దక్షిణాది మార్కెట్లలో జూన్లో ధరలు తగ్గాయి. బొగ్గు, పెట్ కోక్ ధరలు తగ్గిన ఫలితంగా కంపెనీలపై ఖర్చుల ఒత్తిడి తగ్గింది. అధిక స్థాయిలో సిమెంట్ ధరలు ఉండటం, తక్కువ స్థాయిలో ముడిసరుకుల ధరలు ఉన్నందు వల్ల మొదటి త్రైమాసికంలో కంపెనీల లాభాదాయకత పెరిగి ఉండవచ్చని ఇక్రా పేర్కొంది.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications