వారాంతంలో స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ దిగాలు పడ్డాయి. నిన్న కాస్త నిలదొక్కుకున్నట్టు కనిపించిన మార్కెట్ ఈ రోజు మాత్రం పట్టుకోల్పోయింది. నిఫ్టీ మళ్లీ 11800 పాయింట్ల మార్కును నిలబెట్టుకోలేకపోయింది. నిన్న స్థిరంగా కనిపించిన బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు 150 పాయింట్లకు పైగా కోల్పోయింది. అంతర్జాతీయ మార్కట్ల నుంచి నెగిటివ్ న్యూస్తో పాటు మళ్లీ డిహెచ్ఎఫ్ఎల్ ఇబ్బందులు మార్కెట్లను కూలదోస్తాయోమో అనే ఆందోళన కారణమైంది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు.. మిడ్ సెషన్ తర్వాత నీరసించింది. ముఖ్యంగా ఆఖరి అరగంటలో మరింత కుంగిపోయాయి. చివరకు సెన్సెక్స్ 192 పాయింట్లు కోల్పోయి 39394 దగ్గర, నిఫ్టీ 53 పాయింట్లు కోల్పోయి 11788 దగ్గర ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 165 పాయింట్లు నష్టపోయి 31,105 దగ్గర స్థిరపడింది.
గెయిల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్ టాప్ ఫైవ్ గెయినర్స్గా నిలిచాయి. యెస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్, భారతి ఇన్ఫ్రాటెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా నష్టపోయిన షేర్ల జాబితాలో చేరాయి.

మళ్లీ డిహెచ్ఎఫ్ఎల్ కష్టాలు
ఈ నెల 29న ఆర్థిక ఫలితాలను వెల్లడించాల్సి ఉన్న డిహెచ్ఎఫ్ఎల్ మళ్లీ వాటిని వాయిదా వేసింది. ఇప్పటికే గడువు కోరి ఆలస్యం చేసిన సంస్థ.. మరోసారి వాటిని వచ్చే నెలకు వాయిదా వేయడం ఆందోళన రేకెత్తించింది. దీంతో స్టాక్ పదిహేను శాతం వరకూ పతనమైంది. చివరకు 12 శాతం నష్టంతో రూ.72 దగ్గర క్లోజైంది. వీటికి తోడు రుణాలు ఇచ్చిన దాతలు కన్సార్టియంలా ఏర్పడి ఏ విధంగా అప్పులను వసూలు చేయాలి అనే అంశంపై చర్చించడం కూడా స్టాక్ పతనానికి మరో కారణమైంది.
ప్రైవేట్ బ్యాంకుల బాధ
మొన్నటికి మొన్న కొద్దిగా రికవర్ అయినట్టు అనిపించిన యెస్ బ్యాంక్ ఈ రోజు మరో 4 శాతం కోల్పోయింది. ఇంట్రాడేలో రూ.107.60కి పడిపోయి చివరకు రూ.109 దగ్గర క్లోజైంది.
ఇదే బాటలో ఇండస్ ఇండ్ 3 శాతం నష్టపోయింది. ఎన్బిఎఫ్సికి చెందిన ఎం అండ్ ఎం ఫైనాన్స్ 3.5 శాతం, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.2 శాతం దిగొచ్చాయి.
ప్రభుత్వ బ్యాంకుల్లో జోరు
ప్రైవేట్ బ్యాంకులు నీరసంగా ఉంటే.. పీఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో మాత్రం ఈ రోజు ఉత్సాహం నమోదైంది. కెనెరా బ్యాంక్ 2 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2 శాతం పెరిగాయి. మిడ్ క్యాప్ స్పేస్లో కార్పొరేషన్ బ్యాంక్ 7 శాతం, యునైటెడ్ బ్యాంక్ 6 శాతం, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 5 శాతం పెరిగాయి.
అనిల్ అంబానీ కష్టాలు తీరేలా లేవు పాపం
జూలీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తొలగించిన అనేక స్టాక్స్లో అడాగ్ స్టాక్స్ కూడా కొన్ని ఉన్నాయి. వీటికి తోడు అంత సులువుగా పరిష్కారం కాని అనేక సమస్యల నేపధ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రా 7 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 6.5 శాతం నష్టపోయాయి. రిలయన్స్ పవర్ 5 శాతం, రిలయన్స్ హోం ఫైనాన్స్ 9 శాతం నీరసించాయి.
ఏ రూపాకీ బాత్ హై
ఎనిమిది నెలల నుంచి కన్సాలిడేషన్లో కొనసాగుతున్న రూపా అండ్ కంపెనీ స్టాక్ ఈ రోజు హై జంప్ చేసింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ ఏకంగా 50 రెట్లు పెరిగాయి. ఈ స్టాక్ వరుసగా మూడు రోజులుగా పెరుగుతున్నా ఈ రోజు మాత్రం భారీ లాభాలను నమోదు చేసింది. ఒక దశలో 18 శాతంవరకూ పెరిగిన స్టాక్ చివరకు 8 శాతం లాభాలకు పరిమితమైంది. రూ.255 దగ్గర క్లోజైంది. ఇదే బాటలో లవబుల్ లింగరీ కూడా రెండు, మూడు సెషన్ల నుంచి దౌడు తీస్తోంది.
ముచ్చటగా మూడో రోజూ..
కాక్స్ అండ్ కింగ్స్ స్టాక్ ముచ్చటగా మూడో రోజూ పది శాతం డౌన్ సర్క్యూట్తో క్లోజైంది. రూ.150 కోట్ల విలువైన కమర్షియల్ పేపర్స్ డిఫాల్ట్ నేపధ్యంలో స్టాక్ పతనం కావడం తెలిసిన సంగతే. ఈ రోజు కూడా మరో 10 శాతం కోల్పోయిన స్టాక్ రూ.36 దగ్గర క్లోజైంది.
బెంగళూరు ఎఫెక్ట్
భవిష్యత్తులో మరింత నీటి కొరత ఎదురుకాకుండా బెంగళూరులో ఐదేళ్ల పాటు అపార్టుమెంట్ల నిర్మాణాన్ని ఆపేసే యోచనలో ఉన్నట్టు కర్నాటక డిప్యూటీ సీఎం చేసిన ప్రకటన రియల్ ఎస్టేట్ స్టాక్స్లో వణుకు పుట్టించింది. ఇది ప్రధాన మార్కెట్ కావడంతో ఒక దశలో శోభా డెవలపర్స్ 7 శాతం, పుర్వంకర 6 శాతం, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ప్రెస్టీజ్ ఎస్టేస్ట్స్ 4 శాతం కోల్పోయాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications