న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంస్కరణకు తెరలేపింది. 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' విధానం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. పేద ప్రజలు ఎవరైనా అవసరార్థం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లినప్పుడు.. వారికి అందే సబ్సిడీ రేషన్ వస్తువులు పొందడంలో ఇబ్బందులుపడకుండా ఉండేందుకు దీనిని తీసుకు వస్తున్నారు.
ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఆహార భద్రతపై సంబంధిత కార్యదర్శులు, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పోరేషన్ అధికారులతో గురువారం ఢిల్లీలో చర్చించారు. ప్రజా పంపిణీ విధానానికి సంబంధించి వ్యవస్థను కంప్యూటరీకరించడం, ఆహారధాన్యాల పంపిణీ, నిల్వల విషయంలో పారదర్శకత, ఎఫ్సీఐ, సీడబ్ల్యుసీ, ఎస్డబ్ల్యుసీ డిపోలను డిపో ఆన్లైన్ విధానంతో అనుసంధానం చేసే అంశాలపై చర్చించారు.

ఇలాంటి వారికి ఎంతో ప్రయోజనకరం
ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సౌకర్యాన్ని ఇప్పటికే తెలంగాణ, ఏపీ, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాలు కల్పిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఏపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు ప్రజల వద్దకే చేర్చేందుకు సిద్ధమవుతోంది. కేంద్రం మరో అడుగు ముందుకేసి, దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించేందుకు కసరత్తు చేయడం గమనార్హం. ఇది నిరుపేద, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఊరు, రాష్ట్రం.. ఇలా మారినప్పుడు కార్యాలయాల చుట్టు తిరిగే బాధలు తప్పుతాయి. ఇందుకోసం దేశమంతా పనిచేసేలా ఒకే రేషన్ కార్డు విధానం అమలు దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. కార్డుదారులందరికీ, ముఖ్యంగా ఉపాధి వెతుక్కుంటూ ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతం వెళ్లే వలస కార్మికులకు వారికి ఎంతో ప్రయోజనకరం.

మరిన్ని రాష్ట్రాలకు IMPDS
ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ పీడీఎస్ (IMPDS) విధానం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ రాష్ట్రాల్లోని ప్రజలు రేషన్ సరుకులు ఆయా రాష్ట్రంలోని ఎక్కడైనా తీసుకునే వెసులుబాటు ఉంది. మరిన్ని రాష్ట్రాల్లో IMPDSను అమలు చేయనున్నారు. ఈ క్రమంలో ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు అమలు దిశగా ఆహార, ప్రజా పంపిణీ విభాగం రంగంలోకి దిగింది.

అవకతవకలకు ఆస్కారం లేకుండా...
రేషన్ కార్డుల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు కేంద్రస్థాయిలో కార్డుల సమాచారంతో ఒక వ్యవస్థను ఆహార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనుంది. ఇందులో ఆహార, ప్రజా పంపిణీ విభాగం చేసే పని కీలకం. కాగా, FCI, CWC, SWC, ఇతర ప్రయివేటు గోదాముల్లో 612 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను రేషన్ షాపుల ద్వారా ఏటా 81 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. సరుకుల కొనుగోలు నుంచి పంపిణీ వరకు అవినీతి లేకుండా చేసేందుకు సాంకేతికతను వినియోగించనున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications