న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి మిగులు నిధులను అప్పగించే విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదు. ఈ అంశంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులను నియమించారు. ఇది ఏప్రిల్ నెలలో తన నివేదికను సమర్పించవలసి ఉంది. అయితే ఏకాభ్రియం రాని కారణంగా రిపోర్ట్ ఆలస్యమవుతోంది. ఇలా నివేదికలో జాప్యం కావడం ఇది నాలుగోసారి.
కేంద్ర బడ్జెట్ ముగిసిన అనంతరం జూలైలో ఈ కమిటీ నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం రూ.9 లక్షల కోట్ల నిధుల్లో రూ.3 లక్షల కోట్లను తమకు బదలాయించుకోవాలని కేంద్రం పట్టుదలగా ఉంది. దీనికి ఉర్జీత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్న సమయంలో అంగీకారం తెలపలేదు. దీంతో ఆర్బీఐ వద్ద ఎంత మిగులు నిధులు ఉండాలనే అంశం తేల్చేందుకు బిమన్ జలాన్ నేతృత్వంలో కమిటీని వేశారు.

ఈ కమిటీలో రాకేష్ మోహన్ వైస్ ఛైర్మన్గా, సుభాష్ చంద్రగార్గ్ , ఎస్ఎస్ విశ్వనాథన్, భారత్ దోషి, సుధీర్ మ్యాంకడ్ ఉన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉంది. కానీ ఆ తర్వాత జూన్కు వాయిదా వేశారు. ఇప్పుడు దాన్ని జులైకు వాయిదా పడింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications