For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతి స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎన్నికల తర్వాత 'భారీ పెంపు' వట్టిమాటే!

|

న్యూఢిల్లీ: ఆదివారం నాడు పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. 5-6 పైసలు మాత్రమే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి చమురు ధరలు రోజు రోజుకు మారుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో పెట్రోల్ ధర శనివారం రూ.69.93గా ఉండగా, ఈ రోజు 5 పైసలు పెరిగి రూ.69.98గా ఉంది. డీజిల్ ధర రూ.63.78గా ఉండగా, నేడు 6 పైసలు పెరిగి 63.84కు చేరింది.

భరించలేం, మోడీతో మాట్లాడండి: భారత్ దెబ్బ, ట్రంప్‌పై ఒత్తిడిభరించలేం, మోడీతో మాట్లాడండి: భారత్ దెబ్బ, ట్రంప్‌పై ఒత్తిడి

నోయిడాలో పెట్రోల్ ధర రూ.69.98, డీజిల్ ధర రూ.63.32, గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.70.50, డీజిల్ రూ.63.42గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.5 పైసలు పెరిగి రూ.72.19 (శనివారం) నుంచి ఈ రోజు రూ.72.24కు పెరిగింది. డీజిల్ 6 పైసలు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి రూ.75.63 (శనివారం) నుంచి ఈ రోజు రూ.75.68గా ఉంది. డీజిల్ 6 పైసలు పెరిగింది.

Petrol, diesel prices increased. Check todays rates in top cities

చెన్నైలు పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 6 పైసలు పెరిగింది. పెట్రోల్ రూ.72.69గా, డీజిల్ రూ.67.52గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోను పెట్రోల్, డీజిల్ ధరలు 5 నుంచి 6 పైసలు మాత్రమే పెరిగాయి. హైదరాబాదులో పెట్రోల్ ధర రూ.74.37, డీజిల్ ధర రూ.69.58గా ఉంది. అమరావతిలో పెట్రోల్ ధర రూ.74.17, డీజిల్ రూ.69.03గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.73.82గా, డీజిల్ ధర రూ.68.71గా ఉంది.

ఇదిలా ఉండగా, సార్వత్రిక ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని, రూ.10 నుంచి రూ.15 వరకు పెరగవచ్చునని ఎన్నికల ఫలితాలకు ముందు ప్రచారం సాగింది. రూ.90కి చేరవచ్చునని వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ఎన్నికల నేపథ్యంలో భారత్‌లో ధరలు పెంచలేదని, ఫలితాల తర్వాత భారీగా పెంపు ఉంటుందని భావించారు. అయితే ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, భారత్‌లో మాత్రం ఎన్నికల తర్వాత భారీగా పెరగలేదు. అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి స్వల్పంగా హెచ్చుతగ్గులు మాత్రమే ఉంటున్నాయి.

English summary

అతి స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎన్నికల తర్వాత 'భారీ పెంపు' వట్టిమాటే! | Petrol, diesel prices increased. Check today's rates in top cities

The retail prices of petrol were increased by 5-6 paise across four metro cities on Sunday (June 23). In Delhi, petrol prices rose to Rs 69.98 a litre against Rs 69.93 a litre on Saturday while diesel price climbed to Rs 63.84 per litre as compared to Rs 63.78 per litre on Saturday, as per data from Indian Oil Corporation website.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X