బ్యాంకులకు షాక్, ATMలలో డబ్బులు లేకుంటే ఫైన్
ఏటీఎంలలో నగదు లేని సందర్భాల్లో వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి సారించింది. ఏటీఎంలలో డబ్బులు లేని సందర్భాల్లో అత్యవసరమైతే బ్యాంకులు, బిజినెస్ కరస్పాండెంట్స్ వద్దకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి ఛార్జ్ చెల్లించవలసి వస్తోంది. దీనిపై ఆర్బీఐ దృష్టి సారించింది.
ఏటీఎంలలో నగదు లేకుండా మూడు గంటల పాటు ఖాళీగా ఉంచితే జరిమానా విధించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. అది అమలయితే వినియోగదారులకు గుడ్ న్యూస్. అయితే ఈ జరిమానా అన్ని ఏటీఎంలకు ఓకేలా ఉండదని తెలుస్తోంది.
ఏటీఎం ఉన్న ప్రదేశ్, దానికి ఉన్న డిమాండ్, వచ్చే కస్టమర్లను పరిగణలోకి తీసుకొని జరిమానాను విధిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ను ఆర్బీఐ బ్యాంక్ శాఖకు పంపించింది. ఫైన్ విధించాల్సిన వస్తే బ్యాంకులు జాగ్రత్తతో ఏటీఎంలలో డబ్బులు ఉండేలా చూసుకుంటాయి.