రైతు భరోసాపై ప్రశంసలు: రూ.50 వేల ప్రయోజనం, జగన్ ప్రభుత్వంపై ఎంత భారమంటే?

న్యూఢిల్లీ: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఎన్నికలకు ముందు సీఎం నవరత్నాలు ప్రకటించారు. అందులో భాగంగా రైతుల కోసం వైయస్సార్ భరోసా పథకాన్ని తీసుకు వచ్చారు. ఈ పథకంపై స్వామినాథన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ సీఎంకు లేఖ రాశారు.

జగన్‌కు సాయం చేసేందుకు నేను సిద్ధం

జగన్‌కు సాయం చేసేందుకు నేను సిద్ధం

సంక్షోభంలో ఉన్న రైతుల్లో ఈ పథకం మనోధైర్యం నింపిందని స్వామినాథన్ పేర్కొన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని పలుమార్లు కలిసి రైతాంగం కోసం ఆయనతో కలిసి పని చేశానని చెప్పారు. మీ నాయకత్వంలో రైతుల కోసం చేపట్టే కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. వ్యవసాయపరంగా ఉన్న అశాంతికి కారణమైన అంశాలను పరిష్కరించేందుకు జగన్ గట్టిగా దృష్టి సారించారనుకోవడానికి ఇది సరైన చర్యగా అభివర్ణించారు. ఆర్థికంగా, జీవావరణ పరంగా రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు జగన్ తీసుకువెళ్లగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.రైతు సమస్యల పరిష్కారంలో జగన్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను సిద్ధమన్నారు.

జగన్ కీలక నిర్ణయం

జగన్ కీలక నిర్ణయం

ఇటీవల రైతుల కోసం జగన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం తెచ్చిన అన్నదాతా - సుఖీభవ రద్దు చేసి, కొత్తగా రైతు భరోసా స్కీంను తీసుకు వచ్చారు. ఈ పథకం కింద పంటసాగుకు రూ.12,500 ఇవ్వనున్నారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి దీనిని ప్రారంభించనున్నారు. రూ.3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నారు. విపత్తుల నిధికి రూ.2వేల కోట్లు కేటాయిస్తారు. ప్రమాదవశాత్తూ రైతు చనిపోతే రూ.7 లక్షల బీమా ఉంటుంది. పైల రైతులకు లీటరుకు రూ.4 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, పంట బీమా ప్రీమియం రైతులు ఒక్క పైసా చెల్లించకుండా, ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. రైతులకు నష్టం చేసే నకిలీ విత్తనాలపై కూడా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

నాలుగేళ్ళకు ఒక్కో రైతుకు రూ.50వేల ప్రయోజనం

నాలుగేళ్ళకు ఒక్కో రైతుకు రూ.50వేల ప్రయోజనం

అర్హులైన రైతులకు నాలుగేళ్ల పాటు.. ఏడాదికి రూ.12,500 చొప్పున మొత్తం రూ.50వేలు ఇస్తానని జగన్ ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలో పది సెంట్ల నుంచి అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ.15వేలు ఇచ్చారు. అంటే అయిదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.6వేలు కూడా ఉంది. దీంతో కలిపి రూ.15వేలు. తెలంగాణలో రైతులకు ఎకరాకు రూ.4,500 చొప్పున చెల్లిస్తున్నారు.

ప్రభుత్వంపై రూ.13,125 కోట్ల భారం

ప్రభుత్వంపై రూ.13,125 కోట్ల భారం

రైతు భరోసా పథకంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.13,125 కోట్ల భారం పడనుందని అంచనా. ఇదిలా ఉండగా, ప్రతి అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గంలో 200 బోర్‌వెల్స్ ప్రొవైడ్ చేయాలని కూడా జగన్ అధికారులను ఇటీవల ఆదేశించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌస్‌లు నిర్మించాలని ఆదేశించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+