రూ.2,000 తగ్గిన Jio GigaFiber! స్పీడ్, వాయిస్ సేవలు.. మరిన్ని వివరాలు
రిలయన్స్ జియో.. టెలికం రంగంలో సంచలనాలు సృష్టించింది. త్వరలో ఇది బ్రాడ్ బ్యాండ్ రంగంలోకి అడుగు పెడుతోంది. గిగా ఫైబర్ పేరుతో బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ సేవలు అతి త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు కేవలం రూ.600కే అందుబాటులోకి వస్తాయని వార్తలు వచ్చాయి. అలాగే, ఈ సేవల్ని పొందేందుకు సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించే మొత్తాన్ని కూడా జియో తగ్గించినట్లుగా వార్తలు వచ్చాయి.
గుడ్న్యూస్: జూలై 1 నుంచే ఛార్జీలు ఎత్తివేత, నీలేకని సూచనలే.
సెక్యూరిటీ డిపాజిట్
గతంలో సెక్యూరిటీ డిపాజిట్ రూ.4,500గా ఉంటుందని ప్రచారం జరిగింది. దీనికి రూ.2వేలు తగ్గించనున్నరని, రూ.2,500కే కనెక్షన్ ఇస్తున్నారట. ప్రస్తుతం కొంతమందికి ప్రివ్యూ ఆఫర్ కింద ఉచితంగా జియో సేవలు అందిస్తోంది. గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లో కొన్ని మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.
పాత ప్లాన్ ఇలా... కొత్త ప్లాన్ ఇలా...
తాజా రూ.2,500 కనెక్షన్ ప్లాన్తో సింగిల్ బ్యాంట్ రోటర్ను అందిస్తారు. పాత ప్లాన్ అయితే రూ.4,500 కనెక్షన్. దీంతో డ్యూయల్ బ్యాండ్ రోటర్ అందించారు. మొదటి రకం కనెక్షన్ కంటే రెండో రకం కనెక్షన్ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. మొదటి ప్లాన్ వేగం 50ఎంబీపీఎస్ ఉంటే, రెండో ప్లాన్ వేగం 100 ఎంబీపీఎస్ ఉండనుంది. అంటే సగం తగ్గనుంది. ఈ ప్లాన్ యూజర్లకు నెలకు 100 GB డేటాను అన్ని అదనపు కూపన్లతో కలిపి ఇస్తోందని తెలుస్తోంది.
అందుబాటులో వాయిస్ సేవలు
రూ.2,500 ప్లాన్లో వాయిస్ సేవలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా ఇతరులకు కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు జియో టీవీ యాప్ అందిస్తున్నారు. కొత్త సబ్స్క్రిప్షన్కు సంబంధించి జియో ప్రకటన చేయాల్సి ఉంది. రూ.2,500 ప్లాన్ 2.4GHz బ్యాండ్ విడ్త్ను సపోర్ట్ చేస్తుంది. రూ.4,500 ప్లాన్ 5GHz బ్యాండ్ విడ్త్ను సపోర్ట్ చేస్తుంది. రూ.2,500 చీపర్ ప్లాన్తో యూజర్లు గిగా ఫైబర్ కనెక్షన్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో టీవీ యాప్ అందుబాటులో ఉంటుంది. పాత ప్లాన్ యూజర్లకు మాత్రం వాయిస్ కాల్ సర్వీసు అందుబాటులో లేదు.