జిన్‌పింగ్ కలవకుంటే టారిఫ్ పెంచుతాం: చైనాకు ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. G20 సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం లేకుంటే డ్రాగన్ దేశంపై టారిఫ్ మరింత పెరుగుతుందని హెచ్చరించాడు. ఈ భేటీ లేకుంటే మరో 300 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై టారిఫ్ విధిస్తామని చెప్పాడు.

ఈ నెలాఖరున జపాన్‌లో G20 సదస్సు జరగనుంది. చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌తో సమావేశం జరుగుతుందని తాను భావిస్తున్నానని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అలాంటి సమావేశం జరగకపోతే కొత్త సుంకాలను విధించడం ఖాయమన్నారు.

Donald Trump says he will raise tariffs if Xi fails to meet him at G20

ఈ మేరకు CNBC ఛానెల్‌తో ట్రంప్ మాట్లాడారు. G20 సదస్సుకు జిన్‌పింగ్‌ వెళ్తారని అనుకుంటున్నానని, ఒకవేళ వెళ్లకుంటే అది తనను ఆశ్చర్యపరిచే విషయమే అవుతుందని, అలాగని ఆయన వెళ్లకుండా ఉంటారని తాను అనుకోవడం లేదని చెప్పారు.

మరోవైపు, ఇంతవరకు జిన్‌పింగ్-ట్రంప్‌ భేటీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఒకరు ఇది వరకు చెప్పారు. జూన్ 28, 29 తేదీల్లో ఒకాసాలో G20 సమ్మిట్ జరగనుంది.

అమెరికా, చైనా మధ్య గత కొంతకాలంగా ట్రేడ్ వార్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించింది అమెరికా. ప్రతిగా డ్రాగన్ కంట్రీ 60 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా వస్తువులపై టారిఫ్ పెంచింది. మరో 300 బిలియన్ డాలర్ల చైనా వస్తువులపై టారిఫ్ విధించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్‌ హెచ్చరించారు.

భారత్‌పై ఆగ్రహం

డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాలో ఉత్పత్తి అయి భారత్‌కు ఎగుమతి అయిన మోటార్ సైకిలుపై 100శాతం సుంకం నుంచి 50శాతం సుంకం తగ్గించినప్పటికీ అది కూడా చాలా ఎక్కువే అన్నారు. తన నాయకత్వంలో అమెరికా ఉందని ఆదేశాన్ని ఎవరూ మోసం చేయలేరన్నారు. ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడే అయినప్పటికీ అమెరికా మోటార్ సైకిళ్లపై 100శాతం సుంకం విధించడం ఎంతవరకు సబబు అన్నారు.

అమెరికాలో తయారయ్యే హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై భారత్ సుంకం విధించడాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ మోటార్ సైకిళ్లపై ఎలాంటి సుంకం విధించరాదన్నారు. అమెరికా భారత్‌కు హార్లీ డేవిడ్సన్ బైకులను ఎగుమతి చేస్తుండగా భారత్ 100శాతం సుంకం విధిస్తోందని అదే భారత్‌లో తయారయ్యే వాటికి మాత్రం సున్నా శాతం పన్ను ఉందన్నారు. ఈ క్రమంలోనే తాను ప్రధాని మోడీతో మాట్లాడి ఇలాంటి ఆఫర్ తమకు నచ్చలేదని చెప్పానని, ఒక్క ఫోన్ కాల్‌తో మోడీ 50శాతం సుంకం తగ్గించారన్నారు. కానీ సంతృప్తిగా లేమన్నారు. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు.

అమెరికా ధనిక దేశం కాబట్టి తమ ప్రతిపాదనపై భారత్ ఆలోచిస్తోందని ఒకవేళ ఆదేశ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రతిపాదనను పట్టించుకునే వారే కాదన్నారు. కానీ ప్రతి దేశానికి అమెరికాతో పని ఉంటుందని అందుకే అంత గౌరవం విలువ ఇస్తాయన్నారు. అంతేకాదు అమెరికా ధనిక రాష్ట్రం కనుక ఏ చిన్న అవకాశం వచ్చినా పక్క దేశాలు దండుకునేందుకు చూస్తాయన్నారు. అన్ని దేశాలకు తాము బ్యాంకులా కనిపిస్తున్నామని, ఈ బ్యాంకును దోపిడీ చేయాలని చూస్తున్నాయన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+