స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా లాభాల బాటలో పయనించింది. టెక్నాలజీ షేర్లలో మద్దతు నిఫ్టీ మళ్లీ 12 వేల పాయింట్ల దిశగా అడుగులు వేసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు నిఫ్టీకి అండగా నిలిచాయి. ప్రధానంగా ఆసియా, యూరోప్ నుంచి కూడా పాజిటివ్ సపోర్ట్ లభించడం కలిసొచ్చింది. గత వారంలో వచ్చిన నిరుత్సాహంతో ఇన్వెస్టర్లు డీలా పడ్డారు.
అయితే వారం ప్రారంభంలోనే నిఫ్టీ లాభపడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. లాభపడిన స్టాక్స్ కంటే నష్టపోయిన స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎన్ఎస్ఈలో అడ్వాన్స్ - డిక్లైన్స్ చూస్తే ఇది అర్థమవుతుంది. చివరకు నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 11923 దగ్గర, సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 39784 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 31034 దగ్గర స్థిరపడింది.

బిపిసిఎల్, యెస్ బ్యాంక్, కోల్ ఇండియా, గెయిల్, టాటా మోటార్స్ షేర్లు టాప్ ఫైవ్ గెయినర్స్గా నిలిచాయి. బ్రిటానియా, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ గెయినర్స్ జాబితాలో చేరాయి.
సెక్టోరల్ ఇండెక్సుల పరంగా చూస్తే ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా రంగ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. ఎఫ్ఎంసిజి, ఐటి, ఫార్మా రంగ షేర్లు మాత్రమే కాస్త ఫరవాలేదనిపించాయి.
డిహెచ్ఎఫ్ఎల్ రికవరీ
ఎన్సిడీలకు చెల్లించాల్సిన సొమ్ములో భాగంగా అసలు,వడ్డీతో కలిపి సుమారు రూ.276.05 కోట్లను డిహెచ్ఎఫ్ఎల్ చెల్లించిన నేపధ్యంలో ఈ స్టాక్ ఎగిరి గంతేసింది. ఏకంగా 8-9 శాతం పెరిగింది. చివరకు 7.19 శాతం లాభంతో రూ.89.50 దగ్గర క్లోజైంది.
ఎల్ అండ్ టికి ఆర్డర్ బూస్ట్
వివిధ వ్యాపారాల్లో సుమారు రూ.2000-2500 కోట్ల ఆర్డర్లు అందుకున్న నేపధ్యంలో ఎల్ అండ్ టి స్టాక్కు జోష్ నిచ్చింది. దీంతో ఈ స్టాక్ సుమారు రెండు శాతం వరకూ లాభపడింది. చివరకు రూ.1532.20 దగ్గర క్లోజైంది.
అ'నిల్' అంబానీ
గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే క్వార్టర్లో భారీ నష్టాన్ని ప్రకటించిన రిలయన్స్ పవర్ను కుప్పకూల్చారు ఇన్వెస్టర్లు. తమదగ్గరున్న షేర్లను తెగనమ్ముకోవడంతో స్టాక్ భారీగా పతనమైంది. ఆదాయం 35 శాతం క్షీణించి రూ.1586 కోట్లకు పరిమితమైంది. ఇక గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.189 కోట్ల లాభం ప్రకటించిన సంస్థ ఇప్పుడు ఏకంగా రూ.3558.50 కోట్ల నష్టాన్ని చూపించింది.
ఆస్తుల కంటే అప్పులు ఎక్కువగా ఉన్న విషయాన్ని ఆడిటర్ తన నివేదికలో సూచించారు. రూ.4170 కోట్ల ఊహించని నష్టం(ఆస్తుల విలువ మదింపు, ఇచ్చిన అడ్వాన్సులు, రావాల్సిన బకాయిలు రాబోవని నిర్ధారించుకుని కొట్టివేయడం) వల్లే ఈ సారి నష్టానికి కారణమని యాజమాన్యం వెల్లడించింది. అయినప్పటికీ మార్కెట్లో స్టాక్ 20 శాతం వరకూ కోల్పోయింది. ఒక దశలో రూ.4.85కి పడిపోయిన స్టాక్ చివరకు రూ.5.75 దగ్గర ముగిసింది.
ఇదే గ్రూపునకు చెందిన మరో కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రా పరిస్థితి కూడా అలానే ఉంది. వరుసగా ఐదో సెషన్లో కూడా ఈ స్టాక్ పతనమైంది. ఫలితాల ప్రకటన విషయంలో బోర్డ్ మళ్లీ సమయాన్ని తీసుకోవడం ఇన్వెస్టర్లను టెన్షన్ పెట్టింది. దీంతో ఈ స్టాక్ కూడా 13 శాతానికిపైగా కోల్పోయి రూ.64.20 దగ్గర క్లోజైంది.
అనిల్ అంబానీకి చెందిన మరో కంపెనీ యాడ్ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్ 18 శాతం, రిలనయ్స్ హోం ఫైనాన్స్ 13 శాతం, రిలయన్స్ డిఫెన్స్ స్టాక్స్ 10 శాతం నష్టపోయాయి.
జైన్ ఇరిగేషన్కు కార్పొరేట్ ఎఫెక్ట్
జైన్ ఇరిగేషన్కు ఉన్న పైపుల బిజినెస్ను అమ్మడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోందంటూ వచ్చిన వార్తలు స్టాక్ను పడేశాయి. ఈ స్టాక్ ఏకంగా 14 శాతం పతనమైంది. చివరకు రూ.37.35 దగ్గర క్లోజైంది. ఇలా వివిధ కారణాలతో జెకె బ్యాంక్ 12 శాతం, సుజ్లాన్ ఎనర్జీ 11 శాతం, పిజి జ్యువెలర్స్ 10 శాతం, దీపక్ నైట్రైట్ 9 శాతం, అడ్వాన్స్ ఎంజైమ్స్ 7 శాతం నష్టపోయాయి.
క్రూడ్ ఎఫెక్ట్
గత కొంత కాలం నుంచి కూల్గా ఉన్న క్రూడాయిల్లో యాక్టివిటీ పెరిగింది. ధరలు పెరగడంతో మన దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల స్టాక్స్పై ఎఫెక్ట్ పడింది. బిపిసిఎల్, హెచ్ పి సి ఎల్, ఐఓసిఎల్ స్టాక్స్ 2-3 శాతం వరకూ నష్టపోయాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Layoffs: ఒరాకిల్లో భారీ లేఆఫ్స్.. 30 వేల మందిపై వేటు? అసలు కారణం ఇదేనా?

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..



Click it and Unblock the Notifications