SUV కారు కేవలం రూ.2 లక్షలకే వస్తుందా? కానీ చోరకళలో ఆరితేరిన ఓ వ్యక్తి మాత్రం బెంగళూరులో నిస్సాన్ షోరూం లోనికి వెళ్లి డౌన్పేమెంట్గా రెండు లక్షల రూపాయల మొత్తం చెల్లించి, కారుతో ఉడాయించాడు. ఈ కారు ధర సుమారు రూ.19 లక్షలు. కానీ అతను మాత్రం మినిమం అమౌంట్ చెల్లించి ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

నిస్సాన్ షోరూం నుంచి కారు ఎత్తుకెళ్లాడు
కస్టమర్ పేరు థామస్ అలియాస్ జోసెప్. ఇతను నిస్సాన్ షోరూంలోకి వచ్చి ఎస్యూవి కారు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. డౌన్పేమెంట్గా రూ.2 లక్షలు చెల్లించాలని చెప్పడంతో ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఆ తర్వాత తాను కారు పర్ఫార్మెన్స్ చూస్తానని, టెస్ట్ డ్రైవ్ కోసం అనుమతి ఇవ్వాలని షోరూం యాజమాన్యాన్ని కోరాడు. అయితే ఆ కారును తీసుకెళ్లిన జోసెప్ తిరిగిరాలేదు. నాలుగు నెలలుగా అతను కనిపించకుండానే పోయాడు.

HALలో ఫిర్యాదు
ఈ సంఘటన జనవరి 23వ తేదీన బెంగళూరు నగరం దొడ్డనెకుండిలోని సూర్య నిస్సాన్ షోరూంలో జరిగింది. ఈ మేరకు షోరూం మేనేజర్ HAL పోలీస్ స్టేషన్లో మే 21వ తేదీన ఫిర్యాదు చేశారు. కారు మిస్ అయిన దాదాపు నాలుగు నెలల తర్వాత ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును గత గురువారం నాడు HAL పోలీసులు మహదేవపుర పోలీస్ స్టేషన్కు బదలీ చేశారు.

కంప్లయింట్లో ఏం చెప్పారంటే?
ఈ మేరకు షోరూం మేనేజర్ గణేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 23న జోసెప్ అనే వ్యక్తి సాయంత్రం ఆరున్నర గంటలకు వచ్చాడని, రూ.18.6 లక్షల SUV కారుకు గాను డౌన్పేమెంట్గా రూ.2 లక్షలు చెల్లించాడని, ఆ తర్వాత ట్రయల్స్ కోసం వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కారు ట్రయల్స్ కోసం వెళ్తానని చెప్పి ఈ రోజు వరకు అతను తిరిగి రాలేదని, అతనికి ఫోన్ చేసినా తీయడం లేదని, అతను ఇచ్చిన ఆఫీస్ చిరునామాకు వెళ్తే అక్కడా లేడని పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారణను ప్రారంభించారు.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications