నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే ఆ ప్రభావం ప్రభుత్వాలపై ఉంటుంది. గతంలో ఉల్లిగడ్డ ధర పెరగడం వల్ల ప్రభుత్వం పడిపోయిందనే వాదన ఉంది. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ వంటి ధరల పెరుగుదల విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి. ఉల్లి ధరలు పెరుగుతాయనే ఆందోళనతో ప్రభుత్వం పెద్ద ఎత్తున స్టాక్ తెస్తోంది.

50,000 టన్నుల ఉల్లి నిల్వలకు శ్రీకారం
ఉల్లిగడ్డ ఉత్పాదక రాష్ట్రాల్లో కరువు నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో 50,000 టన్నుల భారీ నిల్వకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంగళవారం నాడు సీనియర్ ఫుడ్ మినిస్ట్రీ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసియాలోనే ఉల్లికి అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ అయిన లాసల్గోన్ (మహారాష్ట్ర)లో మంగళవారం కిలో ఉల్లి ధర 29 శాతం పెరిగింది. దీంతో ధర రూ.11కు చేరుకుంది. గత ఏడాది ఇదే రోజున రూ.8.50గా ఉంది. ఉల్లి ఉత్పత్తి తక్కువగా ఉండటమే దీనికి కారణం. దేశ రాజధాని ఢిల్లీలో వివిధ రకాల ఉల్లి ధరలు రూ.20 నుంచి రూ.25 వరకు ఉన్నాయి.

ఉల్లి ధరలు పెరిగే అవకాశం
ఉల్లిగడ్డను ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రబీ సీజన్లో ఉల్లి ఉత్పత్తి గతంలో కంటే తక్కువగా ఉంటుందని అంచనాలు ఉన్నాయని, కాబట్టి ఉల్లిగడ్డ తక్కువగా దొరకడం.. దానికి తోడు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని సదరు అధికారి వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. దేశీయ అవసరాల నిమిత్తం భారీ నిల్వలకు సిద్ధమైనట్లు అధికారులు చెప్పారు. దాదాపు 60 శాతం ఉల్లి మహారాష్ట్ర ఉత్పత్తి చేస్తోంది. మహారాష్ట్రతో పాటు కర్నాటక, ఏపీ వంటి ప్రధాన ఉల్లి ఉత్పాదక రాష్ట్రాల్లోను కరువు కారణంగా ఈ ఏడాది దిగుబడి అంతంతమాత్రమే ఉండవచ్చునని అంచనాలు ఉన్నాయి.

ఉత్పత్తి తగ్గుదల
32,000 టన్నులకు పైగా రబీ ఉల్లి (తెల్ల ఉల్లి)ని కొనుగోలు చేశారు. దీనిని స్టోర్ చేసి జూలై తర్వాత ఉల్లి డిమాండ్ పెరిగిన సమయంలో దీనిని ఉపయోగించనున్నారు. ఈ నెలతో ముగిసే ప్రస్తుత 2018-19 పంట సంవత్సరంలో ఉల్లి ఉత్పత్తి నిరుడుతో పోల్చితే స్వల్పంగా పెరిగి 23.62 మిలియన్ టన్నులుగా ఉంటుందని మొదట అంచనా వేశారు. అయితే సవరించిన అంచనాల ప్రకారం కరువు పరిస్థితుల దృష్ట్యా ఉత్పత్తి తగ్గవచ్చునని చెబుతున్నారు. గతంలో కిలో ఉల్లి రూ.100 వరకు కూడా పెరిగిన విషయం తెలిసిందే.

పప్పు దినుసుల సేకరణ
గత ఏడాది ఉల్లి ఉత్పత్తి భారీగా పెరగడంతో రైతులు 50 పైసలకు తక్కువకు విక్రయించారు. ఈసారి అది రివర్స్ అవుతోంది. ఇదిలా ఉండగా, ఉల్లిగడ్డతో పాటు ఇతర నిత్యావసర వస్తువులపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వం ఈ ఏడాది (2019-20) 16.15 లక్షల టన్నుల పప్పు దినుసులను నిల్వ చేస్తోంది. ఇప్పటికే 11.53 లక్షల టన్నుల పప్పు దినుసులను సేకరించింది.

జూలై - సెప్టెంబర్లో ధరలు...
50,000 టన్నుల ఉల్లిని సేకరించాలని ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ మేనేజ్మెంట్ కమిటీ... నాఫెడ్ (NAFED-National Agricultural Cooperative Marketing Federation of India Ltd)కు సూచించిందని, ఇప్పటికే 32,000 టన్నులు సేకరించిందని, ధరలు పెరిగితే ప్రభుత్వం అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే దీనిపై దృష్టి సారించిందని అధికారులు చెప్పారు. సాధారణంగా ఉల్లి ధరలు జూలై - సెప్టెంబర్ మధ్య పెరుగుతాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications