స్టాక్ మార్కెట్ మళ్లీ నీరసించింది. నిన్న రెట్టించిన ఉత్సాహంతో వారాన్ని ప్రారంభించిన నిఫ్టీ ఈ రోజు కాస్త తడబడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నిరుత్సాహక సంకేతాల నేపధ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. మిడ్ సెషన్ తర్వాత ఒత్తిడి మరింతగా పెరిగింది. ఇంట్రాడేలో నిఫ్టీ 12, 005 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. కానీ పన్నెండు వేల పాయింట్ల సెంటిమెంట్ మార్క్ పైన ముగియడం ఊరటనిచ్చే అంశమే.
ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, మీడియా రంగ కౌంటర్లలో ఎక్కువగా సెల్లింగ్ కొనసాగింది. ఆశ్చర్యకరంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో మాత్రం ఆ స్థాయి సెల్లింగ్ నమోదు కాలేదు. రెండు ఇండెక్సులూ పాజిటివ్గా ముగిశాయి. ప్రధానంగా లార్జ్ క్యాప్ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉండడం గమనించాల్సిన అంశం.
చివరకు సెన్సెక్స్ 185 పాయింట్లు కోల్పోయి 40,083 పాయింట్ల దగ్గర క్లోజైంది. నిఫ్టీ 67 పాయింట్లు తగ్గి 12021 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 65 పాయింట్లు తగ్గి 31589 వద్ద స్థిరపడ్డాయి.

యెస్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, వేదాంతా స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జీ ఎంటర్టైన్మెంట్, హీరో మోటోకార్ప్, టీసీఎస్, హెచ్ సి ఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్ స్టాక్ లూజర్స్గా నిలిచాయి.
హెరిటేజ్ కోలుకుంది
వరుస పతనాలతో ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ ఈ రోజు కాస్త కోలుకుంది. 5 శాతం వరకూ లాభపడింది. ఇంట్రాడేలో రూ.413 వరకూ వెళ్లిన స్టాక్ చివరకు రూ.409 దగ్గర క్లోజైంది.
ఇదే బాటలో అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ కూడా 5 శాతం పెరిగి రూ.224 దగ్గర స్థిరపడింది. ఈ స్టాక్ కూడా కొద్ది రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది.
సిమెంట్ స్టాక్స్ భారీ పతనం
దక్షిణాది ప్రాంతాల్లో ఆఫ్ సీజన్ కారణంగా సిమెంట్ ధరలు బస్తాకు రూ. 25-30 వరకూ తగ్గాయనే వార్తల నేపధ్యంలో సిమెంట్ స్టాక్స్ నీరసించాయి. ప్రధాన కంపెనీల షేర్లతో పాటు మిడ్ సైజ్డ్ కంపెనీల స్టాక్స్ కూడా పతన బాట పట్టాయి. అంబుజా సిమెంట్స్, ఏసీసీ 4 శాతం వరకూ క్షీణించాయి.
శ్రీ సిమెంట్స్ 3.5 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ 5 శాతం, ఇండియా సిమెంట్స్ 5 శాతం తగ్గాయి.
యాక్సిస్ బ్యాంక్ రికార్డ్
ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ ఆకర్షణీయంగా మారుతున్న తరుణంలో యాక్సిస్ బ్యాంక్ స్టాక్ మరింతగా పటిష్టమవుతోంది. ఈ స్టాక్ ఈ రోజు రూ.826.25 ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. చివరకు రూ.821.40 దగ్గర క్లోజైంది.
ఆయిల్ స్టాక్స్ వీక్
ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు కూల్ అయిన నేపధ్యంలో గత మూడు రోజుల నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల స్టాక్స్ లాభాల్లో పయనిస్తూ వస్తున్నాయి. ఈ రోజు వాటిల్లో లాభాల స్వీకరణ నమోదైంది. బిపిసిఎల్ 2 శాతం, హిందుస్తాన్ పెట్రోలియం 2 శాతం, ఇండియన్ ఆయిల్2.5 శాతం నష్టపోయాయి.
రేపు మార్కెట్లకు సెలవు
రంజాన్ సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు. తిరిగి మార్కెట్లు గురువారం ప్రారంభమవుతాయి.
More From GoodReturns

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications