ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందనే అంచనాలు వెలువడటంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. రికార్డు స్థాయిలో మార్కెట్లు సోమవారం లాభాలు చూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 553 పాయింట్లకు పెరిగి 40,268 పాయింట్ల విద్ద ట్రేడ్ అవగా నిఫ్టీ 166 పాయింట్లు లాభంతో 12,088 పాయింట్ల దగ్గర ముగిసింది. సెన్సెక్స్ ముల్లు 598 పాయింట్ల దగ్గర దోబూచులాడి ట్రేడింగ్ ముగిసే సమాయనికి 553.42 పాయింట్ల దగ్గర క్లోజ్ అయ్యింది.
ఇక ఈ రోజు జరిగిన ట్రేడింగ్లో లాభాలు పొందిన వాటిలో హీరోమోటో కార్ప్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందుస్తాన్ యునీలివర్ లిమిటెడ్, మారుతీలు 5.87శాతం వృద్ధిని నమోదు చేశాయి.మరోవైపు చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటం లాంటివి మార్కెట్ సెంటిమెంట్ను మరింత బలపర్చాయి. దీంతో ఆరంభం నుంచే దూకుడు మీదున్న సెన్సెక్స్ నిఫ్టీలు కొత్త రికార్డును క్రియేట్ చేశాయి. కొనుగోళ్లు కూడా బాగా జరగడంతో సోమవారం నాటి ట్రేడింగ్ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. 200 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ను ఆరంభించిన సెన్సెక్స్.. మధ్యాహ్నం తర్వాత మరింత జోరు పెంచింది. హెచ్డీఎఫ్సీ సహా ఇతర కీలక షేర్లు రాణించడంతో భారీ లాభాలు మార్కెట్లను పలకరించాయి.

ఇదిలా ఉంటే గెయిల్, టెక్ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు స్వల్పంగా అంటే 0.13శాతంతో నష్టపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వారంలో జరిగే సమీక్షలో వడ్డీ రేట్లను
తగ్గించే అవకాశం ఉందని అంచనాలతో ట్రేడ్ మార్కెట్లలో ఊపు కనిపించింది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా మందగించిందని కేంద్ర గణాంకాల శాఖ లెక్కలు వెలువరించిన నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనా వేస్తున్నారు మార్కెట్ అనలిస్టులు. ఆర్థిక వ్యవస్థ మందగించడానికి వ్యవసాయ రంగంలో , ఉత్పత్తి రంగంలో సరైన ఔట్పుట్ లేకపోవడమే కారణమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications