రూ.1.23 పైసలు పెరిగిన నాన్ సబ్సిడీ సిలిండర్ ధర, నాన్ సబ్సిడీ ధర రూ.25
గ్యాస్ సిలిండర్ ధరలు స్వల్పంగా పెరిగాయి. నెలవారీ ధరల సవరింపులో భాగంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐవోసీ) 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.1.23 పైసలు పెంచింది. ఎల్పీజీ ధర వరుసగా పెరగడం ఇది నాలుగోసారి. విమానాల్లో ఉపయోగించే ఏటీఎఫ్ ధరను ప్రభుత్వం తగ్గించింది.
సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1.23 పైసలు పెరిగింది. రాయితీలేని సిలిండర్ ధర రూ.25 పెరిగింది. సవరించిన ధరలు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. సబ్సిడీదారులు సిలిండర్ ధరను చెల్లించిన తర్వాత సబ్సిడీ అమౌంట్ వారి అకౌంట్లో జమ అవుతాయి.

ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధరలు పెరగకముందు రూ.496.14, పెరిగిన తర్వాత రూ.497.37, కోల్కతాలో రూ.499.29, పెరిగిన తర్వాత రూ.500.52, ముంబైలో పెరగకముందు రూ.493.86, పెరిగిన తర్వాత రూ.495.09, చెన్నైలో పెరగకముందు రూ.728 పెరిగిన తర్వాత రూ.753గా ఉంది.
ఢిల్లీలో నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంపుకు ముందు రూ.7కొత్త రేషన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
12.5గా ఉండగా, పెరిగిన తర్వాత ర.737.5, ముంబైలో రూ.684.5 ఉండగా, రూ.709.5కు పెరిగింది. చెన్నైలో రూ.728గా ఉన్న ధర రూ.753కు పెరిగింది.


Click it and Unblock the Notifications