దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ ఇండియా వచ్చే నెల 20న తన తొలి మిడ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్ యూవీ ) ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ప్రస్తుతం దీని పేరు ఎస్ పీ 2ఐ. దీన్ని సెప్టెంబర్ నాటికీ మార్కెట్లోకి విడుదల చేయాలనీ కంపెనీ యోచిస్తోంది. ఈ కారు ఇంటీరియర్ చిత్రాలను ఇప్పటికే కంపెనీ విడుదల చేసింది. వీటినిబట్టి అత్యాధునికి ఫీచర్లు ఈ కారులో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కొద్దీ కాలంలోనే తన వాహనాల సంఖ్యను భారీ స్థాయిలో పెంచుకోవాలనుకుంటోంది. ఆ వివరాలను కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ సేల్స్ ఆఫీసర్ యాంగ్ ఎస్ కిమ్ వెల్లడించారు. ప్రతి ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో ఒక కొత్త కారును తీసుకు రావాలన్నది కంపెనీ లక్ష్యం. ఇలా విడుదల చేసి 2021 నాటికీ కనీసం భారత మార్కెట్లో 5 వాహనాలను కలిగి ఉండాలని కంపెనీ భావిస్తోంది.
2020నాటికే మూడు ఎస్ యూవీలను మార్కెట్లోకి తీసుకురావాలన్నది కంపెనీ యో చన. దేశీయ మార్కెట్లో ఎస్ యూ వీ లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే కియా మోటార్స్ ఈ వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కియా మోటార్స్ విడుదల చేసే ఎస్ పీ 2ఐ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా హరియర్, హ్యుండై క్రెటా, రెనో క్యాప్చర్, నిస్సాన్ కిక్స్ కు పోటీగా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కంపెనీ చాలా ఆలస్యంగా భారత మార్కెట్లోకి వస్తోంది. అయినప్పటికీ దేశీయ మార్కెట్లో తన సత్తా చాటుకోవాలని అనుకుంటోంది. కియా తెచ్చే రెండో కారు సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్ యు వి అని తెలుస్తోంది. ఇది ఇటీవలే హ్యుండై విడుదల చేసిన వెన్యూ, మారుతి బ్రేజ్జా, టాటా నిక్సన్, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మహీంద్రా ఎస్ యు వి 300 మోడళ్లకు పోటీగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అనంతపురంలో ప్లాంట్
కియా మోటార్స్ ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో తన కార్ల ప్లాంటును ఏర్పాటు చేసింది. దీని విస్తీర్ణం 536 ఎకరాలు. ఈ ప్లాంట్ వార్షిక స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షలు. ఈ ప్లాంట్ ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కంపెనీ చెబుతోంది. కియా కార్లు కొనుగోలు చేసే వారికి ఫైనాన్స్ సదుపాయం కల్పించేందుకు గాను ఎనిమిది బ్యాంకులతో కంపెనీ ఒప్పందాలు చేసుకుంది.
ఎస్ యు వీ లకు జోరుగా గిరాకీ
చిన్న కార్లకన్నా ఎస్ యు వీలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. గత ఏప్రిల్ నెలలో మారుతి బ్రేజ్జా 11, 785, హ్యుండై క్రెటా 10,487, మారుతి ఎర్టిగా 8,087, టొయోటా క్రిష్ట 5,621, మహీంద్రా బొలెరో 5,310 అమ్మకాలు నమోదు చేసుకున్నాయి. ఇలా ఎస్ యు వీ లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు వీటిపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications