న్యూఢిల్లీ: జీఎస్టీ కింద అరెస్టు అధికారాల పరిశీలనకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. దీనిపై బుధవారం భారత అత్యున్నత న్యాయస్థానం సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఏర్పాటైన ధర్మాసనం విచారణ చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ల మీద వివరణ ఇవ్వాలని కేంద్రానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జీఎస్టీ ఎగవేత నేపథ్యంలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని పలు హైకోర్టులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని సుప్రీం కోర్టు ప్రస్తావించింది. కాబట్టి ఈ అరెస్టులపై చట్టంలోని నిబంధలను సమీక్షించాల్సి ఉందని పేర్కొంది.
అరెస్ట్ అదికారంపై చట్టం ఏమంటుందో చూడాలని పేర్కొంది. అలాగే, జీఎస్టీ చట్టం కింద అరెస్టైన వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసే ముందు ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పును తాము సమర్థించిన విషయాన్ని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. జీఎస్టీ ఎగవేత కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరులో అన్ని రాష్ట్రాల హైకోర్టుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం ప్రకటిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడం గమనార్హం. ఇలాంటి కేసుల్లో అరెస్టుల నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరని తెలంగాణ హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ను ఈ నెల 27న సుప్రీం కొట్టి వేసింది.
జీఎస్టీ ఎగవేత కేసుల్లో అరెస్ట్లు ఆందోళనకరమని ఆ పిటీషన్లో పేర్కొన్నారు. సీజీఎస్టీ చట్టం కింద హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ తమ వద్దకు వచ్చిన పిటిషనర్లకు వ్యతిరేకంగా ఏప్రిల్ 18న తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిని సుప్రీం కోర్టు సమర్థించింది కూడా.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications