ఐడెంటిటీ వెరిఫికేషన్: కస్టమర్ సమ్మతితో బ్యాంకులు ఆధార్ను ఉపయోగించవచ్చు
బ్యాంకులు ఆధార్ కార్డును కేవైసీగా (KYC) పరిగణనించవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం నాడు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ ఇండివిడ్యువల్స్ ఐడెంటిటీ ఎలిజిబుల్ డాక్యుమెంట్లను అప్ డేట్ చేసింది. కస్టమర్ అనుమతితో ఆధార్ అథంటికేషన్కు బ్యాంకులను అనుమతించామని తెలిపింది. ఐడెంటిటీ పర్పస్ కోసం ఎవరైనా స్వయంగా ఆధార్ను ఉపయోగిస్తే దానిని అంగీకరించవచ్చునని తెలిపింది.
జగన్కు సవాలే: ఉన్నది రూ.100 కోట్లు, కావాల్సింది 5వేల కోట్లు
ఆధార్ అనేది పన్నెండు అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య. దీనిని భారత దేశంలో నివసించే వ్యక్తుల వారి వేలి ముద్రలు, కొద్దిపాటి వ్యక్తిగత వివరాల ఆధారంగా పొందవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఏఐ) ఈ సేకరించిన వివరాల ఆధారంగా ప్రతి వ్యక్తికి ఆధార్ జారీ చేస్తుంది. ఆధార్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ.
ఆధార్తో పాటు పలు గుర్తింపు కార్డులను వివిధ సంస్థలు ఆమోదిస్తున్నాయి. ఓటర్ గుర్తింపు కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రయివేటు ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారు సంబంధిత సంస్థచే జారీచేసిన గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఎస్సీ తదితర గుర్తింపు కార్డులు వివిధ సందర్భాల్లో ఉపయోగించవచ్చు.