అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ బెజోస్ తన ఆస్తిలో సగాన్ని చారిటీకి ఇస్తానని ప్రకటించారు. ప్రపంచ బిలియనీర్లు వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఇప్పటికే చారిటీ కోసం నిధులు వెచ్చిస్తున్నారు. ఇప్పుడు మెకంజీ కూడా అదే దారిలో నడిచారు. తనకు ఉన్న 37 బిలియన్ డాలర్ల ఆస్తిలో సగం మొత్తాన్ని చారిటీ కోసం ఇస్తానని ప్రకటించారు.
జెఫ్ బెజోస్, మెకంజీ బెజోస్ కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆమెకు సంస్థలో 4 శాతం వాటా లభించింది. తన వద్ద పెద్ద ఎత్తున సంపద ఉందని, కాబట్టి దీనిని చారిటీకి ఉపయోగిస్తానని ప్రకటించారు. బఫెట్, గేట్స్లా మెకంజీ గివింగ్ ప్లెడ్జ్ (Giving Pledge)లో జాయిన్ అయ్యారు.

గివింగ్ ప్లెజ్ట్ కోసం 23 దేశాలకు చెందిన 204 మంది ఇండివిడ్యువల్స్, కపుల్స్, ఫ్యామిలీస్ ముందుకు వచ్చాయి. తమకు ఉన్న ఆస్తుల్లోని పెద్ద మొత్తం వాటాని చారిటీ కోసం వినియోగించడాన్ని ఎంకరేజ్ చేయడమే గివింగ్ ప్లెడ్జ్. 2019 నాటికి 204 మంది బిలియనీర్లు ముందుకు వచ్చారు. ఇందులో బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఉన్నారు.
ఫార్మర్ న్యూయార్క్ మేయర్ మైఖేల్ బ్లూమ్బర్గ్, సీఎన్ఎన్ ఫౌండర్ టెడ్ టర్నర్, ఎంటర్టైన్మెంట్ ఎగ్జిక్యూటివ్ బారీ డిల్లర్లు 2010లోనే ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం మెకంజీతో పాటు పలువురు ముందుకు వచ్చారు. వారిలో పాల్ టుడర్ జోన్స్, ఎమిరతి బిజినెస్మెన్ షేక్ మొహమ్మద్ బిన్ ముసాల్లామ్ బిన్ హమ్ ఆల్ అమేథీ తదితరులు ముందుకు వచ్చారు.
కాగా, తన మాజీ భార్య తన ఆస్తిలో సగం వాటాను దాతృత్వానికి వినియోగిస్తానని చెప్పడంపై అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ స్పందించారు. అద్భుతమని, మంచి ఆలోచన అని, చారిటీ కోసం తన ఆస్తిని ఇవ్వాలనుకున్న ఆమె ఆలోచన పట్ల తాను గర్వపడుతున్నానని జెఫ్ బెజోస్ అన్నారు. ఆమె మిగతా జీవితం కూడా సంతోషమయంగా, అందంగా ఉండాలని పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications