ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా తన కార్యకలాపాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో జెట్ విమానాలు ఇతర విమానయాన సంస్థలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా లో-కాస్ట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ఇండియా.. జెట్కు చెందిన బోయింగ్ 737 (B737)ను లీజుకు తీసుకోవాలని భావించింది. అయితే వన్ టైప్ ఎయిర్ క్రాఫ్ట్ను కంటిన్యూ చేసేందుకే టాటా గ్రూప్ వెంచర్ మొగ్గు చూపిందట.
జెట్ ఎయిర్వేస్కు చెందిన B737 ఎయిర్ ప్లేన్స్ లీజుకు తీసుకోనున్నట్లు ఎయిర్ ఏసియా.. ఏవియేషన్ రెగ్యులేటర్కు తెలియజేసింది. కానీ ఆ తర్వాత దీని గురించిన డెవలప్మెంట్ లేదు. అయితే చివరకు ఆ ఆలోచనను విరమించుకుంది. ఈ విషయాన్ని ఇండస్ట్రీకి చెందిన సోర్స్ వెల్లడించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

డిఫరెంట్ సీట్ కాన్ఫిగరేషన్, మెయింటెనెన్స్, స్కిల్ రిక్వర్మెంట్ జోడించవలసి ఉంటుందని, కాబట్టి కొత్త విమానాల ఇండక్షన్ అవసరం లేదని భావించినట్లు చెబుతున్నారు. లో-కాస్ట్ ఎయిర్ లైన్స్ బిజినెస్లో వన్ టైప్ విమానయాన సర్వీసులు బాగుంటాయని అంటున్నారు.
ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్వేస్ తమ సర్వీసులను ఏప్రిల్ 17వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. జెట్ ఎయిర్వేస్ ఆగిపోవడంతో దీనిని ప్రత్యర్థి విమానయాన సంస్థలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. స్పైస్ జెట్, విస్తారా వంటి సంస్థలు జెట్ విమానాలను తీసుకోవాలని భావించాయి.
ఈ మేరకు స్పైస్ జెట్ 20కి పైగా జెట్కు చెందిన B737 విమానాలను తీసుకుంది. విస్తారా 4 విమానాలను తీసుకుంది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఎయిర్ ఏషియా ఇండియా కూడా తొలుత ఆసక్తి చూపింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు రెగ్యులేటరీ అప్రూవల్ కోసం పంపించింది. కానీ ఆ తర్వాత విరమించుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications