స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధరలు 14 పైసలు, డీజిల్ ధరలు 16 పైసలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు రూ.71.39, డీజిల్ ధర లీటర్కు రూ.66.45గా ఉంది. గురువారం పెట్రోల్ ధరలు 71.25, డీజిల్ రూ.66.29గా ఉంది. శుక్రవారం స్వల్పంగా ధరలు పెరిగాయి.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.86, డీజిల్ ధర రూ.69.46గా ఉంది. చెన్నై, కోల్కతాలలో పెట్రోల్ ధర వరుసగా రూ.73.32, రూ.73.95గా ఉంది. డీజిల్ ధర రూ.68.05, 70.07గా ఉంది.
హైదరాబాదులో పెట్రోల్ ధర 15 పైసలు పెరగగా, డీజిల్ ధర 18 పైసలు పెరిగింది. హైదరాబాదులో పెట్రోల్ ధర లీటరుకు రూ.75.72, డీజిల్ ధర రూ.72.27గా ఉంది. అమరావతిలో పెట్రోల్ ధర 14 పైసలు, డీజిల్ ధర 16 పైసలు పెరిగింది. దీంతో అమరావతిలో పెట్రోల్ లీటరుకు రూ.75.47, డీజిల్ రూ.71.62కు చేరుకుంది. విజయవాడలో పెట్రోల్ రూ.75.12, డీజిల్ 71.30కు చేరుకుంది.