లోకసభ ఎన్నికల ఫలితాలకు ముందు 39,000 దాటిన సెన్సెక్స్
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 39,087 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11,735 వద్ద ముగిసింది. ఇండియా VIX 30.18 శాతం పెరుగుదలతో నాలుగేళ్ల గరిష్టానికి చేరుకుంది.
ఇండస్ ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్టెల్ భారీగా లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ 1.12 లాభాల్లో ముగిసింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీలు పతనమయ్యాయి. దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు 18 శాతం పతనమయ్యాయి. ఈ కంపెనీ కొత్తగా పబ్లిక్ డిపాజిట్లను స్వీకరించడాన్ని నిలిపివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. డిపాజిట్లను రెన్యూవల్ చేయడం లేదు.
జెట్ ఎయిర్వేస్ షేర్లు వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో కొనసాగాయి. దాదాపు తొమ్మిది శాతం పెరిగాయి. హిందూజాలు వాటాలు కొనుగోలు చేయాలని చూడటం వంటి పలు కారణాలతో ఈ సంస్థ మళ్లీ గాడిన పడుతోందని భావిస్తున్నారు. దీంతో షేర్లు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ వారం దాదాపు 32 శాతం ఈ సంస్థ షేర్లు పెరిగాయి.