బెంగళూరు: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.24.67 కోట్ల వేతనం అందుకున్నారు. 2018-19 కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఆయన వేతనం కింద రూ.6.07 కోట్లు, బోనస్, ప్రోత్సాహాకాలు, వేరియబుల్ పే రూపంలో రూ.10.96 కోట్లు, బత్తా కింద రూ.7.64 కోట్లు తీసుకున్నారు. ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) యూబీ ప్రవీణ్ రావు 2017-18లో రూ.8.22 కోట్లు అందుకోగా 2018-19లో రూ.9.05 కోట్లు అందుకున్నారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో రాజేష్ గోపినాథన్ ప్యాకేజీ కింద రూ.16 కోట్లు తీసుకున్నారు. గోపినాథన్ కంపెన్షేషన్ 28 శాతం పెరిగింది. ఆయన శాలరీ రూ.1.26 కోట్లు, బత్తా కింద రూ.1.26 కోట్లు, కమిషన్ కింద రూ.13 కోట్లు, ఇతర అలవెన్సుల కింద రూ.60 లక్షలు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, ఇన్ఫోసిస్ కంపెనీలో రూ.1 కోటి అంతకు పైగా వేతనం తీసుకుంటున్న వారు ఈ ఆర్థిక సంవత్సరం (2019)లో రెండింతలు అయ్యారు. రూ.కోటి అంతకంటే ఎక్కువ వేతనం తీసుకుంటున్న ఇన్పోసిస్ ఉద్యోగులు ఈ ఏడాది 64 మంది ఉన్నారు. స్టాక్ ఆప్షన్ నేపథ్యంలో భారీ వేతనాలు పొందుతున్నవారిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కూడా ఉన్నారు.

2018లో 30 మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు రూ.1 కోటికి పైగా వేతనం తీసుకున్నారు. ఇప్పుడు రెండింతల కంటే ఎక్కువ పెరిగి ఆ సంఖ్య 64కు చేరుకుంది. కంపెనీ కార్పోరేట్ స్ట్రాటజీ అండ్ రిస్క్ హెడ్స్ దీపక్ పడాకి గత ఏడాది కంటే దాదాపు 75 శాతం కంపెన్షేషన్ తీసుకున్నారు.
2018లో ఆయన రూ.1.81 కోట్లు తీసుకుంటే, ఇప్పుడు రూ.3.16 కోట్లు తీసుకున్నారు. ఈవీపీ అండ్ గ్రూప్ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఇమ్మిగ్రేషన్ కౌషిక్ ఆర్ఎన్ 41 శాతం ఎక్కువగా తీసుకున్నారు. గ్లోబల్ టాలెంట్ అండ్ టెక్నాలజీ హెడ్ బినోద్ హంపాపూర్ 30 శాతం తీసుకున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications