ఇంటిని, ఫ్లాట్లను కొనుగోలు చేసినా స్వాధీనం చెయ్యటం లేదా ? అయితే ఇది మీకు ఊరటనిచ్చే వార్త
గృహ కొనుగోలుదారులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని వెలువరించింది అపెక్స్ వినియోగదారుల కమిషన్. ఇంటిని కొనుగోలు చేసి ఆ ఫ్లాట్ లను స్వాధీనం చేసుకోవడం కోసం సంవత్సరాల తరబడి నిరీక్షిస్తున్న గృహ కొనుగోలుదారులకు లక్షలాది మందికి స్వాంతన కలిగించే నిర్ణయం తీసుకుంది. ఎవరైతే గృహ అమ్మకందారు కొనుగోలుదారులకు గృహం స్వాధీనం చేస్తామన్న సంవత్సరకాలం లోపు స్వాధీనం చేయనట్లయితే బిల్డర్ల నుండి డబ్బులు వాపసు తీసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుందని సూచించింది.
సమయానికి మించి సంవత్సర కాలం అదనంగా గడిచిన నేపథ్యంలో బిల్డర్లు కొనుగోలుదారులు కోరిన పిమ్మట తిరిగి డబ్బు వాపస్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది.
సుప్రీంకోర్టు, మరియు వినియోగదారుల న్యాయస్థానాలు, న్యాయ సమీక్ష సంబంధిత ఫోరమ్లు గృహాన్ని కొనుగోలు చేసిన వినియోగదారుల విషయంలో బిల్డర్లు జాప్యానికి సంబంధించిన కేసులో పదే పదే గృహ కొనుగోలు దారులను వేచి ఉండడం సమంజసం కాదని సూచించింది. కానీ స్వాధీనం చేస్తామన్న సమయానికి స్వాధీనం చేయకుండా ఆలస్యం చేస్తే డబ్బు వాపసు చెల్లించవచ్చు అనేది ఎక్కడా వివరించలేదు.
ఇప్పుడు నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్ రెస్సెల్ కమిషన్ బిల్డర్ అనుకున్న సమయానికి ఇంటిని స్వాధీనపరచకుండా ఇబ్బందికి గురి చేస్తుంటే, అది ఒక సంవత్సర కాల పరిమితి దాటితే తిరిగి బిల్డర్ నుండి డబ్బులు ఆశించవచ్చని కమీషన్ తేల్చి చెప్పింది. వినియోగదారుడికి ఆ హక్కు ఉందని రెడ్ రెస్సెల్ కమిషన్ ప్రేమ్ నారాయణ స్పష్టం చేశారు . 2012లో హర్యానాలోని లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులో ప్లాట్లు కొన్న ఢిల్లీ నివాసి శలబ్ నిగమ్ కేసులో ఈ ఉత్తర్వులను జారీ చేసింది. గుర్గావ్ లో గ్రీన్ పోలీస్ లో ఆర్రిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు త్రీ సీ కంపెనీ అభివృద్ధి చేసిన లగ్జరీ ఫ్లాట్లు నిర్మాణం విషయంలో వినియోగదారుడికి స్వాధీనం చేస్తామన్న సమయానికి ప్లాట్లు అందించని కారణంగా అతని డబ్బు తిరిగి వాపసు చేయాలంటూ కమీషన్ ఈ తీర్పునిచ్చింది.