బలపడిన రూపాయి, స్వల్పంగా పెరిగిన బంగారం ధర
స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 345 పాయింట్ల లాభంతో 37,460 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 11,254 వద్ద ముగించాయి. అదే సమయంలో డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి బలపడింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.7 శాతం పెరిగింది. బంగారం ధర స్వల్పంగా పెరిగింది. జ్యువెల్లరీ బంగారంపై రూ.70 పెరిగింది.
గురువారం డాలర్తో రూపాయి మారకం విలువ 70.3 వద్ద ముగిసింది. గురువారం రూపాయి 70.34 వద్ద క్లోజ్ అయింది. ఇప్పుడు 31 పైసలు బలపడి 70.3 పైసల వద్ద క్లోజ్ అయింది.
గురువారం రోజు దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర జ్యువెల్లరీ కొనుగోలుపై రూ.70 పెరిగి, రూ.33,330కి చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధర కూడా రూ.50 పెరిగి కిలో ధర రూ.38,250గా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా స్పాట్ గోల్డ్ ట్రేడింగ్ ఔన్సుకు 1,295.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. న్యూయార్క్లో వెండి ఔన్సుకు 14.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
ఢిల్లీలో పది గ్రాముల 99.9 శాతం, 99.5 శాతం బంగారం ధరలు రూ.70 పెరిగి రూ.33,330 వద్ద, రూ.33,160 వద్ద కొనసాగాయి. సావెరిన్ గోల్డ్ 8 గ్రాములకు రూ.26,500 వద్ద నిలకడగా ఉంది.