ఎగుమతుల ముసుగులో 12.5కోట్ల మోసం: గుట్టు రట్టు చేసిన కస్టమ్స్ అధికారులు

ఎగుమతుల ముసుగులో రూ.12.5 కోట్ల జీఎస్టీని రీఫండ్‌ రూపంలో వెనక్కి తీసుకునేందుకు 11 షెల్ కంపెనీలు సృష్టించారు కొందరు ప్రబుద్ధులు . . సూరత్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొంత మంది వ్యక్తులు ఈ కంపెనీలను సృష్టించారు. వీటి ద్వారా ఎగుమతుల పేరుతో రూ.12.5 కోట్ల జీఎస్టీని రీఫండ్‌ రూపంలో వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించారు.

షెల్ కంపెనీల పేరుతో 33 కన్‌సైన్‌మెంట్లలో నాణ్యతలేని, తక్కువ ఖరీదైన వాల్‌ పేపర్లు, అతికించుకునే ఫిల్మ్‌లు, కెపాసిటర్లు, సిరామిక్‌ టైల్స్‌ను ఎగుమతి చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం ఈ వస్తువుల ధరను మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా చూపారు. అయితే ఈ వ్యవహారంపై విశ్వసనీయమైన సమాచారం అందటంతో విశాఖ కస్టమ్స్‌ అధికారులు కంటెయినర్లు తెరిచి చూశారు. షెల్ కంపెనీల పేరుతో చేసిన అసలు మోసం బయట పడింది.

With the name of exports 12.5 crores cheating .. customs officials caught the cheaters

ఈ 11 కంపెనీలు దేశంలో ఇంకెక్కడ ఇలాంటి వ్యాపారాలు చేశాయో గమనించాలని, ఇంకెన్ని షెల్ కంపెనీలు పెట్టి ఏ మేరకు మోసం చేశాయో గుర్తించాలని అన్ని విభాగాలను అప్రమత్తం చేసినట్లు కస్టమ్స్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ డీకే శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కంపెనీల ఎగుమతులను నిలిపివేయడంతో పాటు, వాటికి ఎలాంటి ప్రయోజనాలూ కల్పించవద్దని సంబంధిత శాఖాధికారులకు లేఖ రాశామన్నారు. మొత్తానికి మోసం చేసి డబ్బు సంపాదించాలనుకుని అడ్డంగా కస్టమ్స్ అధికారులకు బుక్ అయ్యారు. కస్టమ్స్ అధికారులు వీరి ప్లాన్స్ వమ్ము చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+