ఏడో రోజూ ఏడుపే..!! 500 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
స్టాక్
మార్కెట్
సూచీలు
వరుసగా
ఏడో
రోజు
కూడా
ఏడిపించాయి.
అంతర్జాతీయ
మార్కెట్లలో
ట్రేడ్
టెన్షన్స్
-
దేశీయంగా
అమ్మకాల
ఒత్తిడి
మార్కెట్లను
కుప్పకూల్చింది.
నిఫ్టీ
కీలకమైన
11400
పాయింట్ల
స్థాయిని
కూడా
బ్రేక్
చేసి
కిందికి
రావడం
మరింత
ఆందోళనను
రేకెత్తిస్తోంది.
హెవీ
వెయిట్
స్టాక్స్
అయిన
రిలయన్స్
ఇండస్ట్రీస్
వరుసగా
మూడో
రోజు
కూడా
పతనం
కావడం
టెన్షన్ను
పెంచుతోంది.
నిఫ్టీలో
ఏ
ఒక్క
సెక్టోరల్
సూచీ
కూడా
లాభపడలేదు.
ఈ
రోజు
ట్రేడ్లో
బ్యాంకింగ్,
ఫైనాన్స్,
మెటల్స్,
రియాల్టీ,
ఫార్మా,
మీడియా
కౌంటర్లలో
అత్యధిక
అమ్మకాల
ఒత్తిడి
మరింత
నీరసాన్ని
కలుగ
చేసింది.
చివరకు
నిఫ్టీ
140
పాయింట్ల
నష్టంతో
11,359
దగ్గర
క్లోజైంది.
సెన్సెక్స్
490
పాయింట్లు
కోల్పోయి
37,790
వద్ద
ముగిసింది.
బ్యాంక్
నిఫ్టీ
294
పాయింట్ల
నష్టంతో
28995
వద్ద
స్థిరపడింది.
యూపీఎల్,
జెఎస్డబ్లు
స్టీల్,
బిపిసిఎల్,
టైటాన్,
కోల్
ఇండియా
స్టాక్స్
టాప్
5
గెయినర్స్గా
నిలిచాయి.
జీ
ఎంటర్టైన్మెంట్,
రిలయన్స్,
బజాజ్
ఫైనాన్స్,
టాటా
మోటార్స్,
బజాజ్
ఫిన్సర్వ్
లూజర్స్
జాబితాలో
చేరాయి.
మూడు రోజుల్లో 1000 పాయింట్ల పతనం
గత మూడు రోజులుగా మార్కెట్లలో ఎవరూ ఊహించనంత పతనం నమోదవుతోంది. ఈ మూడు సెషన్లలో బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1000 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 400 పాయింట్ల వరకూ పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ స్టాక్ 10 శాతం వరకూ కోల్పోయింది. ఇంతకాలం మార్కెట్లకు అండగా నిలిచిన రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ టి ట్విన్స్, బజాజ్ ట్విన్స్ కూడా కాస్త నీరసించాయి. దీంతో మార్కెట్లలో షార్ట్ టర్మ్ వీక్నెస్ ఉండొచ్చని టె్కనికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
క్యా హువా ''జీ..''
జీ
గ్రూప్
స్టాక్స్
అన్నింటిలోనూ
పతనం
భారీగా
ఉంది.
నిన్న
కూడా
ఏకంగా
10
శాతానికి
పైగా
పతనమైన
జీ..
ఈ
రోజు
అదే
స్థాయిలో
పడిపోయింది.
తనఖాలో
ఉన్న
షేర్లను
ఎవరూ
అమ్మలేదని,
డీల్
ప్రాసెస్
త్వరలో
పూర్తవుతుందని
యాజమాన్యం
ప్రకటించినప్పటికీ
ప్రయోజనంలేదు.
ఇంట్రాడేలో
స్టాక్
రూ.321
కనిష్ట
స్థాయికి
పడిపోయింది.
భారీ
వాల్యూమ్స్తో
సహా
స్టాక్
ఈ
రోజు
కూడా
15
శాతం
వరకూ
పడింది.
ఆఖరికి
రూ.332
దగ్గర
ముగిసింది.
ఈ
నెల
మూడో
వారంలో
ఆర్థిక
ఫలితాలను
సంస్థ
విడుదల
చేయబోతున్నట్టు
ప్రకటించింది.
ఇదే
బాటలో
మరో
మీడియా
సంస్థ
సన్
టీవీ
కూడా
వరుస
పతనాలతో
కుదేలవుతోంది.
ఈ
స్టాక్
మరో
5
శాతం
పతనమైన
రూ.525
దగ్గర
క్లోజైంది.
జెట్లో మళ్లీ ఆశలు
జెట్ ఎయిర్లో వాటాలు కొనుగోలుకు, ఆర్థికంగా ఆదుకునేందుకు రెడీగా ఉన్నామంటూ బ్రిటన్కు చెందిన అట్మాస్పియర్ ఎయిర్లైన్స్ సిద్ధంగా ఉందనే వార్తలు స్టాక్లో యాక్టివిటీ పెంచాయి. అట్మాస్పియర్తో పాటు నరేష్ గోయెల్, మలార్ హాస్పిటల్స్ కూడా రెడీగా ఉందనే వార్తలొచ్చాయి. దీంతో ఈ స్టాక్ 3 శాతం పెరిగి రూ.131.35 దగ్గర స్టాక్ క్లోజైంది.
ఎడిల్వైజ్ హై జంప్
ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఎడిల్వైజ్.. వాల్యూమ్స్తో సహకారిగా పెరిగింది. స్పష్టమైన కారణాలు ఇంకా తెలియకపోయినప్పటికీ స్టాక్ ఏకంగా 7 శాతానికిపైగా పెరిగింది. చివరకు రూ.146.75 దగ్గర క్లోజైంది.
నియోజన్ బంపర్ లిస్టింగ్
తాజాగా వచ్చిన నియోజన్ ఐపీఓ 17 శాతం ప్రీమియంతో రూ.251 దగ్గర లిస్ట్ అయింది. రూ.215 ఇష్యూ ప్రైస్తో వచ్చిన ఈ స్టాక్ ఇంతటి బలహీన మార్కెట్ కండిషన్స్లో కూడా మంచి ప్రైస్ దగ్గర లిస్ట్ అయింది. చివరకు 23 శాతం లాభంతో రూ.263.55 దగ్గర క్లోజైంది.
వోడా ఐడియా.. రికార్డ్ కనిష్టం
వోడాఫోన్ ఐడియా స్టాక్ నానాటికీ కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ఇంట్రాడేలో మరింత పతనమైన స్టాక్ వాల్యూమ్స్తో నీరసించింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ ఏకంగా 6 రెట్లు పెరిగాయి. దాదాపుగా రైట్స్ ఇష్యూ ధరకు షేర్ పడిపోతూ ఉండడం ఆందోళనను కలిగిస్తోంది. చివరకు స్టాక్ 12 ఏళ్ల కనిష్టానికి దిగొచ్చింది. రూ.14.35 దగ్గర క్లోజైంది.