ట్రేడ్ వార్: చర్చలకు ముందు చైనాకు షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్/బీజింగ్: అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ చర్చలు ముగింపు దశకు వచ్చిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ కంట్రీకి టారిఫ్ అంశంపై హెచ్చరికలు జారీ చేశాడు. 200 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై 25 శాతం పన్ను విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. వాణిజ్య చర్చలు మందగించినందునే ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఈ కొత్త ట్యాక్స్ మే 10వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని ట్రంప్ చెప్పాడు. గత పది నెలల నుంచి యాభై బిలియన్‌ డాలర్ల విలువైన సాంకేతిక వస్తువులపై 25 శాతం, 200 బిలియన్‌ డాలర్ల విలువైన ఇతర ఉత్పత్తులపై పది శాతం సుంకాన్ని అగ్రరాజ్యానికి డ్రాగన్ కంట్రీ చెల్లిస్తోంది.

Trump threatens China with more tariffs ahead of final trade talks

ట్రంప్ తాజా నిర్ణయంతో ఇతర ఉత్పత్తుల పైన చెనా చెల్లిస్తున్న పది శాతం ట్యాక్స్ మే 10వ తేదీ నుంచి 25 శాతానికి చేరుకోనుంది. చైనా, అమెరికా మధ్య ముదిరిన ట్రేడ్ వార్‌కు పరిష్కారం కోసం 2018 నవంబర్‌లో జరిగిన జీ-20 మీట్‌లో ఇరుదేశాధినేతలు నిర్ణయించారు.

వంద రోజుల పాటు ట్యాక్స్ పెంచకూడదని నిర్ణయించాయి. ఈ గడువు మార్చి నెలతో ముగిసింది. అమెరికా మరోసారి ఈ గడువును పెంచింది. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చైనా ఉన్నతాధికారులు బుధవారం వాషింగ్టన్‌లో చర్చలు జరపనున్న నేపథ్యంలో ఈ ట్యాక్స్ పెంపు ప్రాధాన్యత సంతరించుకుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+