ఫేక్కాల్స్ నియంత్రణకు బ్లాక్చెయిన్ టెక్నాలజీ..! అందుబాటులోకి తెచ్చిన టెక్ మహీంద్రా..!!
హైదరాబాద్ : మోసపూరిత ఫోన్ కాల్స్, మెస్సేజీలతో సతమతవుతున్నారా..? క్షణం తీరిక లేకుండా అదే పనిగా అభ్యంతరకర మెస్సేజీలు మిమ్మల్ని విసిగిస్తున్నాయా..? అపరిచితులు ఫోన్ చేసి మీ వివరాలు చెప్పాలని, అభ్యంతరకరంగా మాట్లడుతున్నరా..? ఇక మీరు ఆ సమస్యనుంచి బయట పడ్డట్టే. ఇంత వరకు మోసపూరిత ఫోన్ కాల్స్ తో, మెస్సేజీలతో విసిగిపోయిన మీకు శుభవార్త చెప్పేందుకు ఓ ఐటి కంపెనీ ముందుకొచ్చింది. ఇక అర్థరాత్రులు సైతం మీకు అపరిచితులు పోన్ చేసే ప్రమాదం ఉండదు. తెలియని నంబర్లను కూడా మీరు ధైర్యంగా ఎత్తి హలో అని స్వీట్ గా పలకరించొచ్చు.
టెక్నాలజీ కంపెనీ టెక్ మహీంద్రా తాజాగా టెలికం విభాగంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఫేక్ కాల్స్, మెసేజ్లను నియంత్రించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని, 30 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని కంపెనీ తెలియజేసింది. గతేడాది బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అభివృద్ధి చేశామని, 25 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నామని కంపెనీ గ్లోబల్ ప్రాక్టీస్ లీడర్ రాజేశ్ దుడ్డు గురువారమిక్కడ ఓ కార్యక్రమంలో చెప్పారు. టెలికంతో పాటు తయారీ, ఆర్ధిక, హైటెక్ రంగాల్లోనూ బ్లాక్ చెయిన్ సాంకేతికతను అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్కు ఆడిట్ లావాదేవీల నిర్వహణకు