ఢిల్లీలోని పాష్ ఏరియా ఫ్లాట్స్ ఖాళీ చేయండి: సిబ్బందికి ఎయిరిండియా

ఎయిరిండియా విమానం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నిధులు సమకూర్చుకునేందుకు ఇది ఏకంగా తమ సిబ్బందికి కేటాయించిన ఫ్లాట్లను ఖాళీ చేయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఫ్లాట్లు ఖాళీ చేయాలని ఢిల్లీలోని వసంత్ విహార్ కాలనీలోని సిబ్బందిని కోరింది. ఇక్కడ ఎయిరిండియా సిబ్బందికి 810 ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో 676 ఫ్లాట్లలో సిబ్బంది ఉంటున్నారు.

ఈ ఫ్లాట్ల నుంచి సిబ్బందిని ఖాళీ చేయించి, వాటిని వేలం వేసి నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇక్కడ ఉంటున్న సిబ్బందిని ఖాళీ చేయించినప్పటికీ వారికి ఇళ్లు వెతుక్కోవడంలో సాయం చేస్తామని ఎయిరిండియా ప్రకటించింది. అయితే ఈ ఫ్లాట్లలో ఉంటున్న సిబ్బంది ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారే. పిల్లల పాఠశాలలు సహా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఖాళీ చేయమని చెప్పడం వారికి ఇబ్బందికరంగా మారింది. అలాగే, సంస్థకు చెందిన ప్లాట్లు కాబట్టి రెంట్ కూడా వారికి అందుబాటులో ఉంది. రూ.5వేల నుంచి రూ.25వేల వరకు ఉంది. ఇప్పుడు ఇలాంటి సౌకర్యాలతో ఇళ్లు దొరకడం కష్టంగా భావిస్తున్నారు.

Air India staff asked to vacate posh Delhi flats, Airline sell off plan on

ఇదిలా ఉండగా, ఖాళీ చేయిస్తున్న ఉద్యోగులకు సూటబుల్ అకామిడేషన్ పైన ఓ కమిటీ వేయనున్నారని తెలుస్తోంది. ఉద్యోగులు వెతుక్కున్న సరైన ఇంటికి ఆ ఉద్యోగి తరఫున కంపెనీ లీజింగ్ అగ్రిమెంట్ చేసుకోనుందని తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+