గూడ్స్ అండ్ ట్యాక్స్ సర్వీసెస్ (జీఎస్టీ) రెవెన్యూ రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.1.13 లక్షల కోట్లకు (రూ.1.13 ట్రిలియన్లు) చేరుకుంది. గత ఏడాది ఏప్రిల్ (2018) నెలలోని రూ.1.03 లక్షల కోట్ల వసూళ్లతో పోలిస్తే 10 శాతం ఎక్కువ. 1 జూలై 2017 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. నాటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలో అత్యధికంగా పన్ను వసూలు కావడం ఇదే తొలిసారి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. మార్చి నెలలో రూ.1.06 లక్షల కోట్లు వసూలయ్యాయి. దీంతో పోల్చినా ఎక్కువే.

జీఎస్టీ వసూళ్లు ఇలా
రూ.1.13 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.21,163 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.28,801 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.54,733 కోట్లు, సెస్ రూ.9,168 కోట్లు ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటడం వరుసగా ఇది రెండో నెల. గత మార్చి, ఇప్పుడు ఏప్రిల్ నెలలో దాటాయి. నెలవారీ దాఖలు చేసే జీఎస్టీ 3బీల సంఖ్య 72.13 లక్షలు నమోదయ్యాయి. సాధారణ సెటిల్మెంట్లో భాగంగా ఐ-జీఎస్టీనుంచి సీ-జీఎస్టీకి రూ.20,370 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ.15,975 కోట్లు ప్రభుత్వం సెటిల్ చేసింది.

సెంట్రల్ జీఎస్టీ అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019-20) కేంద్రం సెంట్రల్ జీఎస్టీ నుంచి రూ.6.10 లక్షల కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తోంది. పరిహార సెస్ కింద రూ.1.01 లక్షల కోట్ల వసూళ్లను ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఐజీఎస్టీ వసూళ్లు రూ.50,000 కోట్లు సాధించాలని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో సెంట్రల్ జీఎస్టీ ఆదాయం రూ.4.25 లక్షల కోట్లు, పరిహార సుంకం వసూళ్లు రూ.97,000 కోట్లుగా నమోదయ్యాయి.

అందుకే పెరిగిన వసూళ్లు
గత రెండేళ్ల కాలంలో పన్నుల వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయని, ఎగవేతలకు చెక్ పెట్టడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని చెబుతన్నారు. గతంలో పన్ను వసూళ్లు అ తర్వాత నెలలో మూడో వారంలో విడుదల చేసేది. ఇప్పుడు దీనిని నెల ముగిసిన మరుసటి రోజే ప్రకటిస్తోంది. పన్నులు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని, ఈ-వే బిల్లులపై కఠిన నిబంధనలు, రియల్ ఎస్టేట్ రంగంలో పన్నుల వసూళ్ల సరళి మార్పు కూడా కారణాలని అధికారులు చెబుతున్నారు. కాగా, జీఎస్టీ కాంపోజిషన్ స్కీం పరిధిలోకి వచ్చే వ్యాపారులు త్రైమాసికానికి ఒకసారి రిటర్న్స్ సమర్పించాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రకటించింది. రిటర్న్స్ దాఖలు చేయాల్సిన గడువును వెల్లడించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి అక్టోబరు 31లోపు, అక్టోబర్-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి జనవరి 31 లోపు, జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్ 30లోపు రిటర్న్స్ దాఖలు చేయాలని వివరించింది. రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులు కాంపోజిషన్ స్కీమ్ పరిధిలోకి వస్తారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications