ముడిచమురు ఎఫెక్ట్: లేచిపడిన సూచీలు
స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ముడి చమురు పైన అమెరికా ఆంక్షల ప్రభావంతో నిన్న, నేడు మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సోమవారం నష్టాలతో ముగిసినప్పటికీ మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో కనిపించిన ఉత్సాహం, చివరి దాకా లేదు.
ఆధార్ కార్డు పోయిందా, రీప్రింట్ ఇలా ఆర్డర్ చేయండి
ముడి చమురు విషయంలో ట్రంప్ ఆంక్షలు విధించినా తొలుత పెట్టుబడులపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా లోటు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో సూచీలు లాభాల్లో కనిపించాయి. కానీ చివరలో ముడి చమురు ప్రభావం కారణంగా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
మంగళవారం ట్రేడింగ్లో ఓఎన్జీసీ, జీ ఎంటర్టైన్మెంట్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ హెచ్ఎస్జీ తదితర షేర్లు లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.