గుడ్న్యూస్!: జీఎస్టీ అమ్మకాల రిటర్న్స్ గడువు పొడిగింపు
జిఎస్టీ అమ్మకాల రిటర్న్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది! మార్చి నెలకు జీఎస్టీ అమ్మకాల రిటర్న్స్ జీఎస్టీఆర్ 3బీ దాఖలు గడువును ప్రభుత్వం పొడిగించింది. జీఎస్టీఆర్ 3బీ రిటర్న్స్ దాఖలు, పన్ను చెల్లింపునకు గడువు తేదీ ఏప్రిల్ 20. ప్రభుత్వం ఇప్పుడు దీనిని ఏప్రిల్ 23వ తేదీ వరకు పొడిగించింది. మరో మూడు రోజుల సమయం ఇచ్చింది.
గత నెల మార్చికి గాను జీఎస్టీఆర్ 3బీ దాఖలు గడువును ఈ నెల 23 (మంగళవారం) వరకు పొడిగిస్తున్నట్లు జీఎస్టీ పోర్టల్ gst.gov.inలో పేర్కొన్నారు.
SBI కార్పోరేట్ శాలరీ అకౌంట్: అర్హత, లాభాలు తెలుసుకోండి
జీఎస్టీ నెట్వర్క్లో తరచూ ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు రిటర్న్స్ గడువు తేదీలను పొడిగించేందుకు కారణం అవుతున్నాయని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ భాగస్వామి రజత్ మోహన్ పేర్కొన్నారు. అలాగే, ట్యాక్స్ పేయర్ కూడా గడువు చివరి తేదీ వరకు ఫైల్ చేసే అలవాటు చేసుకున్నారని, దీంతో సర్వర్లు డౌన్ అవుతున్నాయని తెలిపారు.