నిఫ్టీ, సెన్సెక్స్ రికార్డ్ హై: భారీ లాభాలకు కారణాలివే!
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 369.80 పాయింట్ల లాభంతో 39,275.64 వద్ద, నిఫ్టీ ఓ సమయంలో ఏప్రిల్ 3వ తేదీ నాటి కంటే రికార్డ్ స్థాయిలో 11,810.95 పాయింట్ల వద్దకు చేరి, చివరకు 11,787.15 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, ఐటీసీ సూచీలు లాభాలు ఆర్జించాయి. నిఫ్టీ తొలిసారి 11,800 మార్కును తాకింది. ప్రయివేటు బ్యాంకుల సూచీ భారీ లాభాల్లో ట్రేడ్ అయింది. కొత్తగా లిస్టైన మెట్రోపోలీస్ షేర్లు 4.76శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. వరల్డ్ ఫండ్ దీనిలో భారీగా వాటాలు కొనుగోలు చేసింది.
చైనా ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతోందనే వార్తలు ఆసియా మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయి. మరోవైపు, మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడానికి పలు కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, వాణిజ్య లోటు డేటా, మాక్రో డాటా, బ్యాంకుల లాభాల ఉత్సాహం, టెక్నికల్ ఫ్యాక్టర్స్ కారణాలతో మార్కెట్లు భారీ లాభాలు మూటగట్టుకున్నాయి.