300 మిలియన్ల ఫ్యాన్స్పై కన్నేసిన స్విగ్గీ!:హాట్స్టార్లో ఐపీఎల్ చూస్తూనే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు
ఐపీఎల్ సీజన్ను క్యాష్ చేసుకునేందుకు బడాబడా కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తాయి. మ్యాచ్ సమయంలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తాయి. టెలికం కంపెనీలు రీచార్జ్ ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీ కూడా అదే దారిలో పయనిస్తోంది. స్విగ్గీ.. లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్ హాట్స్టార్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది హాట్స్టార్ 300 మిలియన్ వ్యూలు చేరుకుంటాయని భావిస్తున్నారు.
రాహుల్ గాంధీ మినిమం ఇన్కం గ్యారంటీ స్కీం సాధ్యమా?
మీరు క్రికెట్ చూస్తూనే అక్కడి నుంచి ఇష్టమైన ఆహారాన్ని తినవచ్చు. మ్యాచ్ చూస్తున్న సమయంలో హాట్స్టార్ నుంచి బయటకు రాకుండానే మనకు కావాల్సిన ఆహారాన్ని తెప్పించుకునే ఫీచర్ ఉంది. క్రికెట్ ఫ్యాన్స్ హాట్స్టార్ యాప్లో క్రికెట్ చూస్తూ అదే యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ఇందుకోసం స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. హాట్ స్టార్ యాప్ ఓపెన్ చేస్తే స్విగ్గీకి ఆర్డర్ వెళ్తుంది. మీకు స్విగ్గీ యాప్లో కనిపించే రెస్టారెంట్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి. ఐపీఎల్ 2019 కోసం ప్రత్యేకంగా ఈ ఒప్పందం కుదిరింది.
గత ఏడాది ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఫుడ్ ఆర్డర్స్ 25 శాతం పెరిగాయట. క్రికెట్, ఆహారం పట్ల భారతీయులకు ఉన్న ఇష్టాన్ని నెరవేర్చేందుకే హాట్స్టార్తో భాగస్వాములమయ్యామని స్విగ్గీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో 75,000 రెస్టారెంట్లతో స్విగ్గీ కలిసి పని చేస్తోంది. గత ఐపీఎల్ సీజన్లో క్రికెట్ అభిమానులు వివిధ రకాల ఆహారాన్ని రుచి చూసేందుకు ఇష్టపడ్డారని స్విగ్గీ విశ్లేషణలో తేలింది.
ఏ ప్రాంతంలోనివారు దేనిని ఎక్కవగా ఆర్డర్ చేశారో కూడా విశ్లేషణలో వెల్లడైంది. బెంగళూరుకు చెందినవారుపిజ్జా, చండీగఢ్వాసులు కడాయ్ పన్నీర్, దాల్ మఖ్నీ, బటర్ నాన్, చెన్నైవాసులుచికెన్, మటన్ బిర్యానీ వైపు ఎక్కువగా ఆర్డర్ చేశారు. ఎక్కువ ఆర్డర్లు ఢిల్లీ నుంచి వచ్చాయి. అక్కడి వారు బటర్ నాన్, దాల్ మఖ్నీ తినడానికి ఆసక్తి చూపించారు.