'ఎనీడెస్క్' యాప్ను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది. ఇప్పుడు హెచ్డీఎఫ్సీ కూడా తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ యాప్ వాడితే మోసగాళ్ళబారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరించింది.
'ఎనీడెస్క్' యాప్ను డౌన్లోడ్ చేసుకోమని మోసగాళ్లు కోరుతారని, 9 అంకెల కోడ్ తమతో షేర్ చేసుకోమని అడుగుతారని, మీరు కనుక అలా చేస్తే మీ ఫోన్లు హ్యాకింగ్కు గురవుతాయని హెచ్డీఎఫ్సీ తమ కస్టమర్లను హెచ్చరించింది. అలా చేస్తే మీ ఖాతాలోని డబ్బులు మాయం అవుతాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మీ క్రెడిట్ కార్డ్ వివరాలు, ఓటీపీ, పిన్ నెంబర్లను ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దని తెలిపింది. ఎనీడెస్క్ యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు మీ ఫోన్ను ఆపరేట్ చేసే అవకాశముందని తెలిపింది. యూపీఐ ద్వారా డబ్బులు కొట్టేసే ప్రమాదముందని తెలిపింది. ఏదైనా డౌట్ ఉంటే బ్యాంకు అధికారులను సంప్రదించాలని తెలిపింది.
సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి తాము బ్యాంకు అధికారులమని చెబుతారని, మొబైల్ బ్యాకింగ్ యాప్లో సమస్యలను, వాటిని సరిచేసుకునేందుకు ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని కోరుతారని, ఆ తర్వాత 9 అంకెల కోడ్ చెప్పమని అడుగుతారని, అది చెబితే మీరు నేరగాళ్ల బారిన పడినట్లేనని చెబుతున్నారు. మీ ఫోన్ వారి కంట్రోల్లోకి వెళ్తుందని తెలిపారు. ఈ మెయిల్స్, ఫోటోలు, కాంటాక్ట్ వివరాలు కూడా వారి చేతిలో పడే ప్రమాదముందని హెచ్చరించింది.
పొరపాటును ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించి మీ అకౌంట్ను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయించుకోవచ్చునని తెలిపింది. తెలియని కాంటాక్టుల నుంచి వచ్చే సందేశాలు, వాట్సాప్ రూపంలో వచ్చే లింకులను ఓపెన్ చేయకుండా దూరం ఉండటమే మంచిదని చెబుతున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications