బీఎస్ఎన్ఎల్‌కు 4జీ స్పెక్ట్రం: ప్రభుత్వం చెప్పలేదని ట్రాయ్

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లకు 4జీ సేవలకు అనువైన తరంగాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని టెలికం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది.

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)లకు 4జీ స్పెక్ట్రం కేటాయించాలని ట్రాయ్‌కి సిఫార్సు చేసినట్లు గత నెలలో టెలికం శాఖ (డీవోటీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ట్రాయ్ సీనియర్ అధికారి ఒకరు చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

Trai official: No government reference on 4G airwave for state run telecom firms

బీఎస్ఎన్‌ఎల్, ఎంటీఎన్ఎల్‌లకు 4జీ సేవల సౌకర్యం కల్పించాలని డీవోటీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ట్రాయ్‌కి చెప్పామని డీవోటీ చెప్పింది. కానీ అదేం లేదని ట్రాయ్ తాజాగా వెల్లడించింది.

బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లకు 4జీ స్పెక్ట్రం కేటాయింపుపై డీవోటీ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని ఓ అధికారి ప్రముఖ ఇంగ్లీష్ పత్రికతో చెప్పారు. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు 4జీ సేవల్లో దూసుకెళ్తున్నాయి. 4జీ అనుమతిలేని ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం వీటితో పోటీపడలేక నష్టాల్లో కూరుకుపోతున్నాయి.

బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ రుణం భారం రూ.35,000 కోట్లకు పైగా ఉంది. ఉద్యోగులకు జీతాలను కూడా చెల్లించలేని పరిస్థితులో ఉంది. బీఎస్ఎన్ఎల్‍‌లో 1,70,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+