న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు 4జీ సేవలకు అనువైన తరంగాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని టెలికం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)లకు 4జీ స్పెక్ట్రం కేటాయించాలని ట్రాయ్కి సిఫార్సు చేసినట్లు గత నెలలో టెలికం శాఖ (డీవోటీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ట్రాయ్ సీనియర్ అధికారి ఒకరు చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు 4జీ సేవల సౌకర్యం కల్పించాలని డీవోటీ అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ట్రాయ్కి చెప్పామని డీవోటీ చెప్పింది. కానీ అదేం లేదని ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు 4జీ స్పెక్ట్రం కేటాయింపుపై డీవోటీ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని ఓ అధికారి ప్రముఖ ఇంగ్లీష్ పత్రికతో చెప్పారు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు 4జీ సేవల్లో దూసుకెళ్తున్నాయి. 4జీ అనుమతిలేని ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం వీటితో పోటీపడలేక నష్టాల్లో కూరుకుపోతున్నాయి.
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రుణం భారం రూ.35,000 కోట్లకు పైగా ఉంది. ఉద్యోగులకు జీతాలను కూడా చెల్లించలేని పరిస్థితులో ఉంది. బీఎస్ఎన్ఎల్లో 1,70,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications