స్టార్టప్ లపై ట్యాక్స్ మినహాయింపు .. ప్రభుత్వం వెనక్కు తగ్గిందా?
స్టార్టప్ లపై పన్ను మినహాయింపు కు ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టు కనిపిస్తోంది. దీంతో స్టార్టప్ యజమానుల్లో ఆందోళన నెలకొంది. స్టార్టప్ కంపెనీలకు మినహాయింపు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. అయితే దీనిపై ఐటీ శాఖ అధికారులు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో యజమానులు ఆందోళన నెలకొంది.
ఐటి చట్టం 56 (2) ప్రకారం పన్ను మినహాయింపు ఇవ్వడానికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంటర్నల్ ట్రేడ్ నెలరోజుల కింద నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదు.
దీనికి కారణం పన్ను మినహాయింపు ఇవ్వడానికి ప్రభుత్వం వెనక్కి తగ్గటం అని భావిస్తున్నారు. శుక్రవారం రోజు 92 స్టార్టప్ కంపెనీ లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ నుండి ఈ మెయిల్స్ వచ్చాయి. డీపీఐఐటీ కి అందించిన ఫారం 2 సెల్ఫ్ డిక్లరేషన్ రసీదులు అందాయి అన్నది ఆ ఈ-మెయిల్స్ సారాంశం. అంటే మినహాయింపులు ఇస్తామని ఎక్కడా హామీ ఇవ్వలేదు అన్నది దాని అర్థం. కేవలం ఫారం 2 అప్లోడ్ చేసినట్టుగా మాత్రమే పంపించారని మినహాయింపుల గురించి ఏమీ చెప్పలేదని స్టార్టప్ కంపెనీలు ఆందోళనలో ఉన్నాయి.

ఇక సిబిడిటి నుండి టాక్స్ నోటీసులు రాకుండా, డి పీ ఐ ఐ టి నుండి నేరుగా మినహాయింపులు వచ్చేలా ఆటోమేటెడ్ సిస్టం డెవలప్ చేయాలని స్టార్టప్ లు, ఏంజెల్ ఇన్వెస్టర్లు , పలు పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరిన నేపధ్యంలో దీనిపై స్పందించిన కొన్ని శాఖలు స్టార్టప్ లకు ఒక ఫారం అందజేస్తామని ఆ ఫారం చూపిస్తే మినహాయింపు వస్తుందని చెప్పారు.
అసలు డి పీ ఐ ఐ టి ఏంజెల్ టాక్స్ ను రద్దు చేస్తూ అధికారిక ప్రకటన చేసిందని , గతంలో 10 కోట్ల లోపు పెట్టుబడులకు ఉన్న పన్ను మినహాయింపును ఇప్పుడు 25 కోట్ల వరకు పెంచిందని స్టార్టప్ కంపెనీల యజమానులు చెబుతున్నారు.
అయితే ఇంత చెప్పిన తరువాత ఏంజెల్ టాక్స్ చెల్లించాలంటూ తమకు నోటీసులు వచ్చాయని, ఈ నోటీసుల వల్ల తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ షేర్ ప్రీమియంపై టాక్స్ కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏది ఏమైనా పన్ను మినహాయింపు జాప్యం చేయడంతో, అసలు పన్ను మినహాయింపు వస్తుందా లేదా అని, ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గిందా అని స్టార్టప్ యజమానుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications


